Road Accident: అమెరికాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు తెలుగువాళ్లు మృతి
అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురూ తెలుగువాళ్లే. మినీ వ్యాను, ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
కడియం: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు మృతిచెందారు. కనెక్టికట్ రాష్ట్రంలో మినీ వ్యాను, ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మినీ వ్యానులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ముగ్గురు మృతిచెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల్లో ఒకరిది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంక కాగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు.
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాస్ కుమారుడు పాటంశెట్టి సాయి నరసింహ(23) అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో ఎం.ఎస్ చదువుతున్నాడు. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల సమయంలో ఏడుగురు స్నేహితులతో కలిసి మినీవ్యానులో ప్రయాణిస్తున్నాడు. వీరు ప్రయాణిస్తున్న వాహనం పొగమంచు కారణంగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి నరసింహతోపాటు పావని (వరంగల్), హైదరాబాద్కు చెందిన మరో యువకుడు ప్రేమ్కుమార్రెడ్డి మృతిచెందారు. మిగిలిన ఐదుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సాయి నరసింహ కుటుంబసభ్యులకు సమాచారం అందింది.
దీపావళికి వీడియో కాల్ చేశాడు.. ఇంతలోనే..
సాయి నరసింహ చెన్నైలోని హిందుస్థాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఓ కంపెనీలో కొలువు సాధించాడు. అయితే ఎం.ఎస్. చేయాలని భావించి ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 5న అమెరికా వెళ్లాడు. ఇటీవల అక్కడ జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు వీడియో కాల్ సైతం చేశాడు. అంతలోనే తమ కుమారుడు మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు శ్రీనివాస్, సుశీల కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతుడి సోదరి పాటంశెట్టి నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు కలచివేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన సిద్ధిరెడ్డి ఐశ్వర్య కూడా మృతుడు ప్రయాణిస్తున్న మినీ వ్యానులోనే ఉండగా.. ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి