Delhi Murder: ఆ తల, చేతులు శ్రద్ధావేనా..?
సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య జరిగిన కొద్ది రోజులకు తూర్పు దిల్లీలోని ఓ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల, చేతులను పోలీసులు గుర్తించారు. అవి శ్రద్ధావేనా? కాదా అన్నది తెలియాల్సి ఉంది.
దిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసులో దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు అఫ్తాబ్ ఇచ్చిన వివరాలతో మృతురాలి శరీర భాగాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో దొరికిన గుర్తుతెలియని మృతదేహాలు/శరీర భాగాల కేసులపై పోలీసులు దృష్టిపెట్టారు. కాగా.. శ్రద్ధా హత్య జరిగిన కొద్ది రోజులకే తూర్పు దిల్లీలో ఓ చోట కుళ్లిపోయిన స్థితిలో తల, చేతులు లభించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తాజాగా బయటికొచ్చింది.
మే 18న దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో శ్రద్ధా హత్యకు గురైంది. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్న త్రిలోక్పురి ప్రాంతంలో ఈ ఏడాది జూన్లో కొన్ని గుర్తుతెలియని శరీరభాగాలను పోలీసులు గుర్తించారు. పాండవ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామ్లీలా మైదానానికి సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మనిషి తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం.. ఓ చెత్తకుప్పలో ఉన్న తల, చేతులను గుర్తించారు. అక్కడ పడేయడానికి ముందు ఆ శరీర భాగాలను ఫ్రిజ్లో భద్రపర్చినట్లు అప్పుటి ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
అవి ఒకే మృతదేహానికి చెందినవి అయి ఉంటాయని అప్పట్లో పోలీసులు భావించారు. దీంతో వాటిని ఎవరు పడేశారా అని తెలుసుకోవడం కోసం సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. ఈ కేసులో ఎటువంటి పురోగతి లభించకపోవడంతో తదుపరి దర్యాప్తు కోసం కేసును దక్షిణ దిల్లీ పోలీసులకు అప్పగించారు.
శ్రద్ధా హత్య జరిగిన కొద్ది రోజులకే ఈ అవయవాలను గుర్తించడంతో ఇప్పుడు పోలీసులు ఆ కేసుపై దృష్టిపెట్టారు. తూర్పు దిల్లీలో లభ్యమైన తల, చేతుల భాగాలను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. అవి శ్రద్ధావేనా? కాదా? అన్నది ఫోర్సెనిక్ నివేదిక వస్తేనే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. కాగా, హత్య అనంతరం ఆమెను గుర్తించడానికి వీల్లేకుండా తల భాగాన్ని కాల్చేసిన తర్వాత పారేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది.
శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికిన తర్వాత వాటిని దిల్లీలోని పలు చోట్ల విసిరేసినట్లు నిందితుడు అఫ్తాబ్ పోలీసులు విచారణలో అంగీకరించిన విషయం తెలిసిందే. ఎక్కువగా మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేసినట్లు చెప్పడంతో.. నిందితుడిని తీసుకుని అక్కడ వెతికారు. ఆ ప్రాంతంలో ఇప్పటివరకూ 10కి పైగా ఛిద్రమైన భాగాలు దొరికాయి. అయితే అవి శ్రద్ధావేనా? లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో ఇప్పటివరకు శ్రద్ధా తలను పోలీసులు గుర్తించలేదు. దీంతో పాటు ఆమెను చంపినట్లుగా భావిస్తున్న ఆయుధం, ఆమె దుస్తులను కనుగొనలేదు. హత్య జరిగి నెలలు కావడంతో ఆమె శరీరభాగాలు ఇప్పటికే కుళ్లిపోవడమో లేదా వీధి శునకాలు తినేయడమో జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ కేసు నిరూపణకు సాక్ష్యాధారాల సేకరణ పోలీసులకు సవాల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
జిల్లాలోని కర్నూలు మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
బస్సులో 9 మంది సజీవ దహనం
హరియాణాలోని నూహ్ జిల్లా ధులావత్ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్- పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో