Crime News: దారుణం.. 15 ఏళ్ల బాలుడికి ఇలాంటి ఆలోచనా..!
15 ఏళ్ల వయసు.. ఇంకా పాఠశాల కూడా దాటని ప్రాయం. చదువు, ఆటలు, పోటీ పరీక్షలు, ఏ కాలేజ్లో చేరాలి.. ఇవే కదా ఆ వయసువారి ఆలోచనలు. కానీ కేరళకు చెందిన ఓ బాలుడు ప్రవర్తించిన తీరు మాత్రం నివ్వెరపరుస్తోంది. అతడిని ఆ పరిస్థితికి పురికొల్పిన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
21 ఏళ్ల యువతిపై అత్యాచార యత్నం
తిరువనంతపురం: 15 ఏళ్ల వయసులో కేరళకు చెందిన ఓ బాలుడు ప్రవర్తించిన తీరు నివ్వెరపరుస్తోంది. అతడిని పురికొల్పిన పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మలప్పురం జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు.. 21 ఏళ్ల యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకొంది. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బాధితురాలు కంప్యూటర్ క్లాస్కు వెళ్తున్న విషయాన్ని గమనించిన నిందితుడు ఆమెను అనుసరించాడు. ఆ సమయంలో పెద్దగా జనసంచారం కూడా లేదు. అదే అదునుగా చూసి, ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లాడు. ఆమె తలపై రాయితో కొట్టి, చేతుల్ని దుప్పట్టాతో కట్టేశాడు. ఆ తర్వాత ఆమె గొంతు నొక్కి.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించి సమీపంలోని ఇంటికి పరిగెత్తింది.
ఈ ఘటనపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు..ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపర్చారు. అనంతరం జువైనల్ హోంకు తరలించారు. ‘మేం ఆ యువతితో మాట్లాడాం. అంతకు ముందు ఎప్పుడూ అతడిని చూడలేదని చెప్పింది. మేం సేకరించిన సమాచారం ఆధారంగా అతడిని ప్రశ్నించనున్నాం’ అని వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలు షాక్లో ఉండటంతో పూర్తి వివరాలు చెప్పలేకపోతోందన్నారు. మరోపక్క, ఆ బాలుడికి మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
మైనర్ బాలికతో తనకు జరిగే నిశ్చితార్థాన్ని అధికారులు ఆపారనే క్షణికావేశంలో ఓ యువకుడు ఆ బాలిక తల నరికి హత్య చేశాడు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి