TS News: ఫైనాన్స్‌ కట్టలేక నడిరోడ్డుపై ఆటోను తగులబెట్టిన డ్రైవర్‌

హనుమకొండ కాలేజీ కూడలిలో ఓ డ్రైవర్‌ తన ఆటోను కాల్చేసుకున్నాడు. పెట్రోల్‌ పోసి నిప్పంటించగా.. ఆటో పూర్తిగా కాలిపోయింది. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరల వల్ల జీవనోపాధి

Updated : 13 Sep 2023 12:47 IST

హనుమకొండ: హనుమకొండ కాలేజీ కూడలిలో ఓ డ్రైవర్‌ తన ఆటోను కాల్చేసుకున్నాడు. పెట్రోల్‌ పోసి నిప్పంటించగా.. ఆటో పూర్తిగా కాలిపోయింది. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరల వల్ల జీవనోపాధి కోల్పోయానని డ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనాకు తోడు ధరల పెరుగుదలతో అప్పుల భారం పెరిగిపోయి ఆటో ఫైనాన్స్‌ చెల్లించలేక దానికి నిప్పంటించానని చెప్పాడు. లాక్‌డౌన్‌లో కొద్ది రోజులు ఆటోలు తిరగలేదని.. ప్రస్తుతం ఆటోల్లో తిరిగేవారు తక్కువయ్యారని డ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో వాహనాన్ని కాల్చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు అని డ్రైవర్‌ అన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని