AP NEWS: ప్రేమ వివాహం.. ఆ తరువాత ఏమైందంటే?

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో కులాంతర ప్రేమ పెళ్లి వివాదానికి దారితీసింది. గణపవరానికి చెందిన పొలిశెట్టి రవి, గుంటూరుకు చెందిన..

Updated : 11 Aug 2021 16:35 IST

నాదెండ్ల: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో కులాంతర ప్రేమ పెళ్లి వివాదానికి దారితీసింది. గణపవరానికి చెందిన పొలిశెట్టి రవి, గుంటూరుకు చెందిన ఓ యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి సెలవులకు రవి ఇంటి దగ్గరలోని బంధువుల ఇంటికి వచ్చి వెళుతుండేది. ఈక్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. మేజర్లు కావడంతో వారం క్రితం పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాదెండ్ల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించారని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి సర్దిచెప్పి పంపించారు. ఈక్రమంలో ఇవాళ రవి ఇంటి వద్ద నోములు జరుపుకొంటుండగా.. అమ్మాయి తరఫు బంధువులు వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలవగా, రవి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను అదుపు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని