AP NEWS: ప్రేమ వివాహం.. ఆ తరువాత ఏమైందంటే?
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో కులాంతర ప్రేమ పెళ్లి వివాదానికి దారితీసింది. గణపవరానికి చెందిన పొలిశెట్టి రవి, గుంటూరుకు చెందిన..
నాదెండ్ల: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో కులాంతర ప్రేమ పెళ్లి వివాదానికి దారితీసింది. గణపవరానికి చెందిన పొలిశెట్టి రవి, గుంటూరుకు చెందిన ఓ యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి సెలవులకు రవి ఇంటి దగ్గరలోని బంధువుల ఇంటికి వచ్చి వెళుతుండేది. ఈక్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. మేజర్లు కావడంతో వారం క్రితం పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాదెండ్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి రక్షణ కల్పించారని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి సర్దిచెప్పి పంపించారు. ఈక్రమంలో ఇవాళ రవి ఇంటి వద్ద నోములు జరుపుకొంటుండగా.. అమ్మాయి తరఫు బంధువులు వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలవగా, రవి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను అదుపు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.