Crime News: దొంగలు పడ్డారని యువతి కేకలు.. నిజం తెలిసి షాకైన పోలీసులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఎర్రబోడలోని ఓ ఇంట్లో  జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు.

Updated : 11 Apr 2024 18:16 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఎర్రబోడలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. గురువారం ఉదయం 10గంటల సమయంలో దొంగలుపడ్డారని యువతి కేకలు వేసింది. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు చొరబడి ఇంట్లో ఉన్న రూ.25వేలు అపహరించుకుపోయారని తెలిపింది. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తోసేసి పారిపోయారని నమ్మించే ప్రయత్నం చేసింది.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు.. క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఎక్కడా చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో యువతిని పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఆమె చెప్పిందంతా కట్టుకథ అని తేలడంతో షాక్‌ అయ్యారు. ఇటీవల ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి రూ.25వేలు పోగొట్టుకుంది. ఆ నగదు స్నేహితుల వద్ద నుంచి తీసుకుంది. వారు...డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడగడంతో చోరీ డ్రామాకు తెరలేపినట్టు విచారణలో తేలింది. బీరువాలో దుస్తులు తానే చిందరవందరగా పడేసి గట్టిగా కేకలు వేసినట్టు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని