Crime News: దొంగలు పడ్డారని యువతి కేకలు.. నిజం తెలిసి షాకైన పోలీసులు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎర్రబోడలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎర్రబోడలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. గురువారం ఉదయం 10గంటల సమయంలో దొంగలుపడ్డారని యువతి కేకలు వేసింది. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు చొరబడి ఇంట్లో ఉన్న రూ.25వేలు అపహరించుకుపోయారని తెలిపింది. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తోసేసి పారిపోయారని నమ్మించే ప్రయత్నం చేసింది.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. క్లూస్ టీమ్ను రంగంలోకి దింపారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఎక్కడా చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో యువతిని పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఆమె చెప్పిందంతా కట్టుకథ అని తేలడంతో షాక్ అయ్యారు. ఇటీవల ఆన్లైన్ గేమ్స్ ఆడి రూ.25వేలు పోగొట్టుకుంది. ఆ నగదు స్నేహితుల వద్ద నుంచి తీసుకుంది. వారు...డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడగడంతో చోరీ డ్రామాకు తెరలేపినట్టు విచారణలో తేలింది. బీరువాలో దుస్తులు తానే చిందరవందరగా పడేసి గట్టిగా కేకలు వేసినట్టు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్ను సరకు రవాణా వాహనం ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. -
సీఎస్ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్ప్లే పిక్చర్)ను వినియోగించి సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. -
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ
మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. -
రాష్ట్ర సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. -
వివాహితపై యువకుడి అత్యాచారం
ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. -
గుజరాత్ తీరంలో రూ.60 కోట్ల విలువైన హషిష్ స్వాధీనం
గుజరాత్ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్ను స్వాధీనం చేసున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!