Anantapur: కళ్ల ముందే లెక్చరర్‌ హత్య.. గుండెపోటుతో భార్య మృతి

కళ్ల ముందే భర్త హత్య.. ఆయన మృతిని తట్టుకోలేక మనస్తాపంతో భార్య మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.

Updated : 11 Mar 2024 14:54 IST

అనంతపురం (క్రైమ్‌): కళ్ల ముందే భర్త హత్య జరగడంతో తట్టుకోలేక మనస్తాపంతో భార్య మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని జేఎన్టీయూ సమీపంలో లెక్చరర్‌ మూర్తి రావు గోఖలే(59), ఆయన భార్య శోభ(56) నివసిస్తున్నారు. మూర్తి రావు ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో తన మేనల్లుడు ఆదిత్య దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ విషయంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో కత్తితో ఆదిత్య.. మూర్తిరావు గొంతు కోసి హతమార్చాడు. కళ్ల ముందే భర్త మృతిచెందడంతో జీర్ణించుకోలేక ఆదివారం అర్ధరాత్రి శోభ గుండెపోటుతో మృతి చెందారు. దంపతుల మృతితో ఇంటివద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని