హలో.. హలోకు అనుమతి
మారుమూల గ్రామాల్లో సంకేతాల (సిగ్నల్స్) సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రత్యేకంగా సెల్టవర్లు మంజూరు చేసింది. స్థలసమస్య కారణంగా పలు పనులు నిలిచి పోయాయి.
జిల్లాలో 62 బీఎస్ఎన్ఎల్ టవర్ల నిర్మాణం
కాగజ్నగర్ గ్రామీణం, కాగజ్నగర్, న్యూస్టుడే
కాగజ్నగర్ మండలం వంజీరి సమీపంలో కొనసాగుతున్న టవర్ నిర్మాణ పనులు
మారుమూల గ్రామాల్లో సంకేతాల (సిగ్నల్స్) సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రత్యేకంగా సెల్టవర్లు మంజూరు చేసింది. స్థలసమస్య కారణంగా పలు పనులు నిలిచి పోయాయి. అటవీ, రెవెన్యూ అధికారుల ఉమ్మడి సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా.. ఇటీవల ఆ స్థలాల్లో నిర్మాణాలకు ఉత్తర్వులు నెం.262.23.ఎస్4 తేదీ 17-01-2024న వచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ ఆదిలాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.జగోరాం ప్రకటించారు. దీంతో సంకేతాలు లేక కొన్నేళ్లుగా అవస్థలు పడుతున్న గిరిజన గ్రామాల ఇబ్బందులు తొలగనున్నాయి. బీఎస్ఎన్ఎల్(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) సెల్ టవర్ల మంజూరు...పనుల పురోగతిపై కథనం.
జిల్లాలోని పలు గిరిజన, గిరిజనేతర మండలాల్లోని మారుమూల గ్రామాల్లో సంకేతాల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సేవలను విస్తరించాలనే సంకల్పంతో.. 62 సెల్ టవర్లను మంజూరు చేసింది. ఒక్కొక్క టవర్ నిర్మాణానికి దాదాపు రూ.1.30 కోట్లు కేటాయించింది. ఆసిఫాబాద్ మండలంలో 7, బెజ్జూరు-2, చింతలమానేపల్లి-1, దహెగాం-4, కాగజ్నగర్-5, కెరమెరి-12, కౌటాల-4, పెంచికల్పేట-3, రెబ్బెన-1, సిర్పూరు(టి)-4, తిర్యాణి-13, వాంకిడి-6 టవర్లు మంజూరయ్యాయి.
26 టవర్ల పనులు..
జిల్లాలోని వివిధ మండలాల్లోని 36 సెల్ టవర్ల నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలాలు కేటాయించగా.. 26 టవర్ల స్థలాలకు అటవీ శాఖ అనుమతి పేరిట పనులు నిలిచి పోయాయి. రెవెన్యూ అధికారులు కేటాయించిన స్థలాల్లోని టవర్ల పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. మిగతా 26 సెల్ టవర్ల నిర్మాణానికి రెండు నెలల కిందట అటవీ అనుమతులు రాగా.. వాటి పనులను అధికారులు, గుత్తేదార్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ సెల్ టవర్లను సైతం నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రతి టవర్ వద్ద సోలార్ ప్లాంటుతోపాటు, అన్ని సదుపాయాలను కల్పిస్తూ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అనుమతులు లభించిన టవర్ల నిర్మాణాలు ప్రారంభించి వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కాగజ్నగర్ మండలం కడంబాలో సిగ్నల్స్ లేక ఊరు బయట ఫోన్ మాట్లాడుతున్న యువకులు
జిల్లాలోని మారుమూల మండలాల్లోని పలు గ్రామాల్లో నేటికీ సంకేతాల సమస్య తీవ్రంగా ఉంది. తిర్యాణి మండలంలోని.. లింగాపూర్, లొద్దిగూడ, చిన్నదాంపూర్, కీమనాయక్ తండా, రాఘవపూర్, మోదీగూడ, పెంచికల్పేట మండలంలోని.. మొర్లిగూడ, జిల్లెడ, కొండపల్లి, దహెగాం మండలంలోని.. లోహ, మొట్లగూడ, రాంపూర్, దిగడ, కెరిమెరి, లింగాపూర్ మండలాల్లో సంకేతాలు అందక వృద్ధులు, దివ్యాంగులు ప్రతి నెలా పింఛన్ల కోసం ఇతర మండలాలు, గ్రామాలనూ ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈ సమస్య పరిష్కరించేందుకే ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ టవర్లను మంజూరు చేసింది.
త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు
జి.జగోరాం, డిప్యూటీ జనరల్ మేనేజర్, బీఎస్ఎన్ఎల్
గిరిజన మారుమూల గ్రామాల్లోనూ సంకేతాల సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సెల్ టవర్ల నిర్మాణానికి రూ.కోట్లు కేటాయించింది. స్థల సమస్యతో కొంత జాప్యం జరిగినప్పటికీ ప్రసుత్తం అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. నిలిచిన పనులన్నింటినీ సత్వరమే ప్రారంభించి సకాలంలో పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. గతంలో ప్రారంభించిన టవర్ల పనులు దాదాపు పూర్తి కావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాస్త్రీయ కళలు ఈ తరానికి అందించడం అభినందనీయం
[ 27-04-2024]
కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు. -
అంతర్ రాష్ట్ర రహదారిపై భాజపా నాయకుల రాస్తారోకో
[ 27-04-2024]
పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. -
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం