ప్రభుత్వ బడులకు ఉచిత వెలుగులు
ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు ఛార్జీలు గుదిబండగా మారాయి. సర్కారు అందించే నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి.
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల
ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు ఛార్జీలు గుదిబండగా మారాయి. సర్కారు అందించే నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలలకు సైతం ఉచిత విద్యుత్తు అందించాలని కొన్నిరోజుల నుంచి కోరుతున్న మేరకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వం బడులకు, కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బాలకు ఉచిత విద్యుత్తు అందించేందుకు ఇటీవల నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించడం బడులకు ఉపశమనం కలిగించింది.
సరిపోని నిర్వహణ నిధులు
ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు ఏటా రెండు దశలుగా నిధులు సమకూరుస్తుంది. విద్యార్థుల ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తోంది. ఇందులో రూ.25 వేల వరకు వచ్చే పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. స్టేషనరీ కొనుగోలు, పలు కార్యక్రమాల నిర్వహణ, మరమ్మతులు, ల్యాబ్ నిర్వహణ, అంతర్జాలం, విద్యుత్తు బిల్లుల చెల్లింపులు, తాగునీరు, ఇతర సదుపాయాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఓసారి, ముగింపు లో మరోసారి నిధులు వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
రూ.కోటి వరకు బకాయిలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యుత్తు అమలులో భాగంగా బకాయిల వివరాల సేకరణలో విద్యాశాఖ నిమగ్నమైంది. సుమారుగా రూ.1,77,07,474 విద్యుత్తు బిల్లుల బకాయిలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల రెగ్యులర్గా చెల్లిస్తుండగా మరికొన్ని చోట్ల బకాయిలు ఉన్నాయి. అక్కడక్కడా విద్యుత్తు మీటర్లు పని చేయకపోవడం, మరికొన్ని బడుల్లో అసలే విద్యుత్తు కనెక్షన్లు లేకుండా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 78 పాఠశాలు విద్యుత్తు మీటర్లు లేనివిగా ఉన్నట్టు గుర్తించారు.
పెరిగిన విద్యుత్తు వాడకం
పాఠశాలలకు కేటగిరీ-7ఏ కింద విద్యుత్తు మీటర్ల కనెక్షన్ ఇచ్చారు. నీటి అవసరాలకు మోటారు బోరు వినియోగం, తరగతి గదులు, ఉపాధ్యాయ గదుల్లో ఫ్యాన్లు, డిజిటల్ తరగతులు, ప్రొజెక్టర్లు వంటివి వినియోగిస్తారు. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాల కల్పనలో భాగంగా ‘మన ఊరు మన బడి’ పథకంలో ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులను అందజేశారు. దీంతోపాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఇటీవల కంప్యూటర్లు అందజేశారు. వీటన్నింటి వినియోగంతో విద్యుత్తు బిల్లులు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో పాఠశాల సుమారు రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నాయని పలువురు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
జిల్లా కేంద్రంలో 200కుపైగా విద్యార్థులు ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతినెలా రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు బిల్లు వస్తోంది. పాఠశాలకు ఒక్కో విడతలో రూ.30 వేల వరకు ప్రభుత్వం నుంచి నిర్వహణ నిధులు అందుతున్నాయి. గతేడాది తొలివిడతలో అందిన నిధులతో సెప్టెంబరులో రూ.15,351 బిల్లు చెల్లించారు. వచ్చిన గ్రాంట్లో సగం విద్యుత్తు బిల్లుకే సరిపోతుంది. ఈ నెలలో పాఠశాలకు విద్యుత్తుశాఖ నుంచి అందిన బిల్లులో రూ.3095రాగా గత బకాయిలు కలుపుకుని మొత్తం రూ.27,361 చెల్లించాల్సి ఉంది. అయితే పాఠశాలకు విడుదలయిన నిధులు విద్యుత్తు బిల్లులకే అవుతుందని ఉచిత విద్యుత్తు అందిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో ప్రయోజనకరం
పోకల వెంకటేశ్వర్లు, రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు
పాఠశాలలకు నిర్వహణ నిధులు సకాలంలో రాకపోవడం, వచ్చిన నిధులు సరిపోని కారణంగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బడుల నిర్వహణలో అన్నింటికి విద్యుత్తు వాడకం తప్పనిసరి. నిధులు లేమితో బకాయిలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ బడులకు ఉచిత విద్యుత్తు విషయం చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రయోజనకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాస్త్రీయ కళలు ఈ తరానికి అందించడం అభినందనీయం
[ 27-04-2024]
కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు. -
అంతర్ రాష్ట్ర రహదారిపై భాజపా నాయకుల రాస్తారోకో
[ 27-04-2024]
పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. -
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా