‘పది’ మూల్యాంకనానికి ఏర్పాట్లు
పదోతరగతి పరీక్షలు ఈనెల 30తో ముగియనున్నాయి. ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్షపత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇతర జిల్లాల నుంచి పత్రాలు చేరాయి.
జిల్లాకు చేరుతున్న పరీక్ష పత్రాలు
న్యూస్టుడే, పాలనాప్రాంగణం
మూల్యాంకనం జరిగేది ఇక్కడే
పదోతరగతి పరీక్షలు ఈనెల 30తో ముగియనున్నాయి. ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్షపత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇతర జిల్లాల నుంచి పత్రాలు చేరాయి. జిల్లాకు 1.90 లక్షలు కేటాయించడంతో పరీక్షలు ముగిసేనాటికీ దశల వారీగా మూల్యాంకనం నిమిత్తం రానున్నాయి. ఏప్రిల్ 3 నుంచి ఆదిలాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్ వేదికగా మూల్యాంకనం జరగనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో 53 పరీక్ష కేంద్రాల్లో 10,354 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 30తో ప్రధాన పరీక్షలు ముగియనుండగా.. మరో రెండు రోజుల్లో ఒకేషనల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఫలితాలను సకాలంలో ప్రకటించేందుకు వీలుగా ఒక పక్క పరీక్షలు జరుగుతుండగానే మరోవైపు జవాబుపత్రాలను మూల్యాంకనం కోసం ఆయా జిల్లాలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. జిల్లాకు ఇతర జిల్లాల నుంచి ఇప్పటి వరకు జరిగిన తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గణితం విషయాలకు సంబంధించి 80 వేల జవాబు పత్రాలు జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రానికి చేరుకోగా.. పటిష్ఠ బందోబస్తు నడుమ వాటికి కోడింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాకు మూల్యాంకనం కోసం 1.90 లక్షల జవాబు పత్రాలు కేటాయించగా.. పరీక్షలు ముగిసేనాటికీ అవన్నీ రానున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 11 వరకు ఉపాధ్యాయులు జవాబు పత్రాలు దిద్దుతారు. ఇందుకోసం ఇప్పటికే సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తూ డీఈవో ప్రణీత ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 3న మూల్యాంకన కేంద్రానికి ఉదయం 9 గంటలకు హాజరయ్యే సంబంధీకులను రిలీవ్ చేయాలని ఎంఈఓలు, హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చారు.
843 మందికి బాధ్యతలు
జిల్లా విద్యాశాఖాధికారి క్యాంపు అధికారిగా, కార్యాలయ సహాయ సంచాలకులు(ఏడీ) నర్సిములు, పరీక్షల విభాగ సహాయ కమిషనరు వేణుగోపాల్రెడ్డి సహాయ క్యాంపు అధికారులుగా వ్యవహరించనున్నారు. పేపర్ కోడింగ్ అధికారులుగా 10 మంది పీజీహెచ్ఎంలను, వారికి సహాయకులుగా 30 మంది డైట్ ఛాత్రోపాధ్యాయులను నియమించి కోడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. సహాయ మూల్యాంకన అధికారులు(ఏఈ)గా 527 మందిని, ముఖ్య మూల్యాంకన అధికారులు(సీఈ)గా 91 మందిని, ప్రత్యేక సహాయకులు(స్పెషల్ అసిస్టెంట్)గా 182 మంది ఉపాధ్యాయులకు ఆయా బాధ్యతలు అప్పగించారు.
ప్రక్రియ మొదలైంది
వేణుగోపాల్రెడ్డి, ఏసీ, పరీక్షల విభాగం
మూల్యాంకన కేంద్రానికి రోజువారీగా జవాబు పత్రాలు చేరుతున్నాయి. ఎప్పటికప్పుడు వాటికి కోడింగ్ చేస్తున్నాం. ఏప్రిల్ 3 నుంచి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే విధులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేశాం. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు పహారా నడుమ సమాధాన పత్రాలు స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాస్త్రీయ కళలు ఈ తరానికి అందించడం అభినందనీయం
[ 27-04-2024]
కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు. -
అంతర్ రాష్ట్ర రహదారిపై భాజపా నాయకుల రాస్తారోకో
[ 27-04-2024]
పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. -
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం