భారాసతోనే రాష్ట్రానికి మేలు
భారాసతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ నెడ్క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమయ్య అన్నారు.
ఆదిలాబాద్లో ప్రచారం చేస్తున్న పురపాలక అధ్యక్షుడు ప్రేమేందర్, భారాస నాయకులు
బజార్హత్నూర్, న్యూస్టుడే : భారాసతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ నెడ్క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమయ్య అన్నారు. మండలంలోని వర్తమన్నూర్, ఎల్లయ్యపల్లె, పిప్పిరి గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు.
బోథ్: భారాస నాయకులు సురేందర్ యాదవ్, రాజు, సుభాష్, ప్రశాంత్, రమణగౌడ్, ప్రవీణ్, సత్యనారాయణ, రఫీ, వినయ్ బోథ్లో ప్రచారం చేశారు.
నేరడిగొండ: తెలంగాణ వాదాన్ని భారాసతోనే నెరవేర్చుకోవచ్చని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని బోరిగాంలో ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో భారాస ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఉట్నూరు గ్రామీణం: ఉట్నూరు ఎంపీపీ పంద్ర జైవంత్రావు లక్కారంలో ఉపాధి కూలీలను కలిసి భారాసకు ఓటేయాలని కోరారు. చికెన్ సెంటర్లో చికెన్ కొడుతూ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇంద్రవెల్లి : ధనోర(బి) మాజీ సర్పంచి ఏర్మా జాకేశ్, ఉప సర్పంచి సంతోష్ మహరాజ్లతో పాటు నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ పట్టణం : కాంగ్రెస్, భాజపాలకు ఓటు వేస్తే వృథా అవుతుందని ఆదిలాబాద్ పురపాలక ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పార్లమెంటులో ప్రజల గళం వినిపించాలంటే భారాస అభ్యర్థి ఆత్రం సక్కునే గెలిపించాలని కోరారు. పట్టణంలోని కేఆర్కే కాలనీలో శనివారం ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. నాయకులు రమేష్, భరత్, రవి, గంగన్న, భూమన్న, వినోద్, మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు స్వరూపరాణి, మమత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]