logo

ఎడ్ల బండి ఎక్కిన కలెక్టర్

మండల కేంద్రమైన భీంపూర్‌లో ఓటరు చైతన్య కార్యక్రమం వినూత్న రీతిలో నిర్వహించారు.

Published : 05 May 2024 16:47 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: మండల కేంద్రమైన భీంపూర్‌లో ఓటరు చైతన్య కార్యక్రమం వినూత్న రీతిలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు పూలతో స్వాగతం పలికారు. అలంకరించిన ఎడ్ల బండిపై ఎక్కిన కలెక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎండల దృష్ట్యా సాయంత్రం వేళ 5 గంటలకు బదులుగా 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని