జాబితాలో తప్పుల సవరణకే గ్రామసభలు
ప్రభుత్వం ప్రకటించిన నిర్వాసితుల జాబితాలో తప్పులేమైనా ఉంటే సరి చేసుకునేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చింతూరు ఎంపీడీఓ రవిబాబు పేర్కొన్నారు.
గ్రామసభలో మాట్లాడుతున్న చిన్నారెడ్డి
చింతూరు, న్యూస్టుడే: ప్రభుత్వం ప్రకటించిన నిర్వాసితుల జాబితాలో తప్పులేమైనా ఉంటే సరి చేసుకునేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చింతూరు ఎంపీడీఓ రవిబాబు పేర్కొన్నారు. చింతూరు బీసీ కాలనీలో మంగళవారం ఆర్అండ్ఆర్ ప్యాకేజి అర్హుల జాబితాపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభలో జరిగే చర్చలతో జాబితాలు పూర్తయినట్లు కాదని తెలిపారు. జాబితాలో తప్పులు సరిచూసుకుని, ఎవరైనా జాబితాలో లేనివారు ఉంటే వారిని చేర్చి రీసర్వే నిర్వహిస్తామని పేర్కొన్నారు. చింతూరులో ఏడేళ్లుగా నివసిస్తున్నట్లు ఆధారాలు కలిగి ఉన్నవారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. పూర్తిస్థాయి సర్వే అనంతరం అర్హుల జాబితాను ప్రకటించి ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేస్తుందని చెప్పారు. ప్రత్యేక ఉప కలెక్టర్ విక్టర్బాబు, తహసీల్దార్ సాయికృష్ణ, ఉప ఎంపీపీ సుధాకర్, ఎంపీపీ అమల, పంచాయితీ కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు.
* అధికారులకు అవగాహన లేకుండా గ్రామసభలు నిర్వహిస్తున్నారని తెదేపా మండల అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి విమర్శించారు. చింతూరు బీసీ కాలనీలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి ప్యాకేజీ అందించాల్సిన బాద్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. నిర్వాసితులు ఎలాంటి ప్యాకేజీ అందుకుంటారో అధికారులు చెప్పలేకపోతున్నారని ఆరోపించారు. ఒక అవగాహనతో గ్రామ సభలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఎవరికీ అన్యాయం జరగదు
కూనవరం, న్యూస్టుడే: పోలవరం నిర్వాసితుల్లో అర్హత ఉన్న ఎవరికీ అన్యాయం జరగదని ప్రత్యేక ఉప కలెక్టర్ (ఎస్డీసీ) సుబ్బారావు భరోసా ఇచ్చారు. టేకులబోరులో నిర్వహించిన ఆర్అండ్ఆర్ గ్రామసభలో నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. నిర్వాసితుల అనుమానాలను నివృత్తి చేశారు. తాడ్వాయిలో ఇచ్చే ఇంటి స్థలాలను వెళ్లి చూసి రావచ్చన్నారు. అనంతరం ఎంపీపీ పాయం రంగమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు గుజ్జా విజయ నిర్వాసితుల సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచి కట్టం రాజమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బండారు సాంబశివరావు, తహసీల్దార్ అనసూర్య పాల్గొన్నారు.
రాంగోపాలపురంలో పునరావాసం
వరరామచంద్రాపురం: చిన్నమట్టపల్లి పంచాయతీలోని గుంగువారిగూడెం, ప్రత్తిపాక గ్రామాల పోలవరం ముంపు నిర్వాసితులు ఎటపాక మండలంలోని రాంగోపాలపురంలో పునరావాసం పొందడానికి సుముఖంగా ఉన్నట్టు చిన్నమట్టపల్లి సర్పంచి పిట్టా రామారావు మంగళవారం తెలిపారు. ఆ గ్రామంలోని మూడు చోట్ల ఉన్న పొలాలను సోమవారం పరిశీలించామన్నారు. రెండు ముంపు గ్రామాల 334 కుటుంబాల అభిప్రాయం మేరకు తీర్మానం చేసి తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శికి అందించామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం