భార్య హత్య కేసులో జీవిత ఖైదు
భార్యను హతమార్చిన భర్తకు జీవితకాల కారాగార శిక్ష విధిస్తూ విశాఖపట్నం మహిళా కోర్టు ఆరో అదనపు జిల్లా జడ్జి సువర్ణరాజు తీర్పు ఇచ్చారు.
నిందితుడు శివప్రసాద్
జి.మాడుగుల, న్యూస్టుడే: భార్యను హతమార్చిన భర్తకు జీవితకాల కారాగార శిక్ష విధిస్తూ విశాఖపట్నం మహిళా కోర్టు ఆరో అదనపు జిల్లా జడ్జి సువర్ణరాజు తీర్పు ఇచ్చారు. జి.మాడుగుల ఎస్సై శ్రీనివాసరావు సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీ ఉర్లమెట్ట గ్రామానికి చెందిన భానుమతి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమె భర్త సోమెలి శివప్రసాద్ 2021 సంవత్సరం ఆగస్టులో ఆమెను కత్తితో నరికి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. హత్యకు సంబంధించి ముఖ్యమైన ఆధారాలు సేకరించి కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు శిక్షతోపాటు రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడి మృతి
అరుగుల ప్రసాద్ (పాత చిత్రం)
కోరుకొండ, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ-బూరుగుపూడి గేటు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 18వ తేదీన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో పూర్ణిమ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుగుల ప్రసాద్(28) సోమవారం మృతిచెందాడు. దీంతో స్వగ్రామం కోరుకొండ మండలం పశ్చిమగోనగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇతడు రంపచోడవరంలోని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రమోదీయం.. జనామోదం
[ 07-05-2024]
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. -
విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
[ 07-05-2024]
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. -
అల్లూరి స్ఫూర్తికి అడుగడుగునా తూట్లు
[ 07-05-2024]
రిటిష్ వారి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఏకం చేసి వారిని ఉద్యమ వీరులుగా తీర్చిదిద్దిన యోధుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలకు వెరవకుండా ఆయన చేసిన పోరాటం ఈనాటికీ గిరిజనులను ఉత్తేజపరుస్తూనే ఉంది. -
సమర్థులు వీరు.. గెలిపించాలి మీరు!
[ 07-05-2024]
సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో దింపాం. వారిని ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. -
రాష్ట్రంలో కూటమిదే అధికారం
[ 07-05-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమిదే అధికారమని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
కదల్లేని వారిపై కనికరమేది...!
[ 07-05-2024]
ప్రతిపక్షాలపై కక్ష.. కదల్లేని పింఛను లబ్ధిదారులకు శాపంగా మారింది. వయోవృద్ధులకు ఇంటికే వెళ్లి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
నాలుగు వేల మందికి ఒకే బూత్
[ 07-05-2024]
స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ను వేసేందుకు అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు విశేష స్పందన
[ 07-05-2024]
తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ విజయ సునీత సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో మన్యం నిర్లక్ష్యం
[ 07-05-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం రైతులపాలిట శాపంగా మారుతుందని, ప్రజలు భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదముందని అరకులోయ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?