logo

ప్రభుత్వం మారకపోతే సామాన్యులకు ఇబ్బందులు

రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా అరకు పార్లమెంట్‌ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాకురి శేఖర్‌ అన్నారు.

Published : 28 Mar 2024 02:12 IST

ఈతరొబ్బలులో యువతతో మాట్లాడుతున్న భాజపా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్‌

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా అరకు పార్లమెంట్‌ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాకురి శేఖర్‌ అన్నారు. ఈతరొబ్బలు గ్రామంలో బుధవారం ఆయన పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత ప్రచారానికి వినియోగించడం వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారకపోతే సామాన్యులు మరింత ఇబ్బందులు పడతారన్నారు. అరకు పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని కోరారు. భాజపా మండల అధ్యక్షుడు వనపల జోగిరాజు, నాయకుడు మొట్టడం లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని