‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
పోస్టల్ బ్యాలెట్లు (పాత చిత్రం)
విశాఖపట్నం, న్యూస్టుడే: పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఎన్నికల విధుల్లో పాలుపంచుకునే ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతోపాటు మీడియా ప్రతినిధులకు, 85ఏళ్లు దాటి మంచానికే పరిమితమైన వయో వృద్ధులు, 40 శాతం పైబడి వైకల్య ఇబ్బందులు ఎదుర్కొంటూ కదల్లేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు, పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇవ్వనున్నారు. ఎన్నికలేతర విధుల్లో ఉండే డ్రైవర్లు, నాలుగో తరగతి ఉద్యోగులనూ ఈ జాబితాలో చేర్చారు. 2019 ఎన్నికల్లో కేవలం ఎన్నికల విధుల్లోని ఉద్యోగులతో పాటు సర్వీసు ఓటర్లకు మాత్రమే ఈ సదుపాయం కల్పించారు.
- అప్పట్లో విశాఖ జిల్లాలో 15,000-17,000 మంది వరకు వినియోగించుకున్నారు. ఈసారి సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఒక ఓటరు ఎమ్మెల్యేకు ఒకటి, ఎంపీకి ఒక ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా పోలింగ్ సిబ్బంది సంఖ్య పెరిగింది. నిర్వహణకు దాదాపు 15వేల మంది ఉద్యోగులు అవసరం ఉందని అంచనా. ఈసీ అదనంగా అనుమతి ఇచ్చిన ఉద్యోగులు మరో 5 వేల మంది వరకు ఉంటారు. వీరితో పాటు సర్వీసు ఓటర్లు మరో నాలుగు వేల మంది ఉన్నారు.
- వయోవృద్ధులు, దివ్యాంగులు వెరసి మరో పదివేలమంది వరకు ఉండే అవకాశం ఉంది. మొత్తంగా దాదాపు 30 వేల మందికి పైబడి పోస్టలు బ్యాలెట్లు వినియోగించుకునే వారు ఉంటారని అంచనా. ఎన్నికల విధులకు నియమితులయ్యే వారికి ఈనెలాఖరులో తొలి విడత శిక్షణ ఇస్తారు. రెండో విడత శిక్షణ నామపత్రాల ఘట్టం పూర్తి అయ్యాక ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణ శిబిరం సమయంలో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఒక వేళ ఇక్కడ ఇష్టం కాకుంటే అసెంబ్లీ, పార్లమెంటు ఆర్ఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే డ్రాప్ బాక్సుల్లో వేయొచ్చు.
- ఎన్నికలు జిల్లాలో నాలుగో దశలో జరగనున్నాయి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రానుంది. 29వ తేదీతో నామపత్రాల గడువు పూర్తయి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తేలనున్నారు. ఆ తర్వాతే బ్యాలెట్ పేపర్ అందుబాటులోకి వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ పత్రాల వ్యవహార బాధ్యతలను జీవీఎంసీ అదనపు కమిషనర్ విశ్వనాథన్కు అప్పగించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనే వారు తమ ఓటు ఏ నియోజకవర్గం పరిధిలో ఉంది? పోలింగ్ కేంద్రం, వరస సంఖ్య వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక