నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది.
షిప్యార్డులో ‘ఎఫ్ఎస్ఎస్’ నిర్మాణ పనుల్లో జాప్యం
రెండింటిని ప్రైవేటు సంస్థకు అప్పగించినట్టు సమాచారం
పూర్తి చేయాల్సిన ఆర్డర్ ఫ్లీట్ సపోర్ట్ వెసల్
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది.
ఎట్టకేలకు చేతికొచ్చే..: గతేడాదిలో అయిదు ఫ్లీట్ సపోర్ట్ వెసల్స్ నిర్మించే ఆర్డర్ను నామినేషన్ ప్రాతిపదికన రూ.19 వేల కోట్లకు షిప్యార్డు దక్కించుకుంది. ఈ మేరకు భారత నౌకాదళం, హిందుస్థాన్ షిప్యార్డు 2023 ఆగస్టు 25న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. షిప్యార్డు చరిత్రలో అత్యంత విలువైన ఆర్డర్గా పరిగణించి... అప్పట్లోనే సంస్థ యాజమాన్యం, కార్మికవర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.
ఒప్పందం ప్రకారం అయిదు వెసల్స్ను 88 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. తొలి వెసల్ను 2027 ఆగస్టు నాటికి, మిగిలినవి అక్కడి నుంచి ప్రతి 10 నెలలకు ఒకటి చొప్పున పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది.
మౌలిక వసతులు కరవు..!: ఫ్లీట్ సపోర్ట్ వెసల్స్ను సకాలంలో పూర్తి చేయడానికి షిప్యార్డులో అవసరమైన మౌలిక వసతులు లేకపోవడంతో... ఇప్పటివరకు వెసల్ నిర్మాణంలో తొలి అంకమైన ‘ప్లేట్ కటింగ్ ప్రొసెస్’ కూడా జరపలేదని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయితేనే ‘కీలు లేయింగ్’ (పనుల ప్రారంభ పూజ) చేపట్టే ఆస్కారం ఉంటుంది. వెసల్ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ దిగుమతిలోనూ జాప్యం జరుగుతోందని సమాచారం. మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి ప్రధాన సమస్యల్ని అధిగమిస్తేనే సకాలంలో ఆర్డర్ల పూర్తవుతాయని కార్మిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
2015లో తొలిసారిగా టర్కీకి చెందిన అనడోల్ కంపెనీ సాంకేతికత వినియోగించి, ఆ సంస్థతో కలిసి సంయుక్తంగా ఎఫ్ఎస్ఎస్ నిర్మాణానికి షిప్యార్డు యాజమాన్యం మొగ్గుచూపింది. అయితే అప్పటికే ఈ వెసల్స్ డిజైన్ పూర్తిగా పాకిస్థాన్కు అనుకూలంగా ఉందన్న కారణంతో నిర్మాణానికి కేంద్ర రక్షణ మంత్రిత్విశాఖ స్వస్తి పలికింది.
రెండింటిని బదలాయించారా..?
భారత నౌకాదళానికి వెన్నుదన్నుగా నిలిచేలా రూపొందించాల్సిన ఫ్లీట్ సపోర్ట్ వెసల్స్ ఆర్డర్లో రెండింటిని మరో ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు షిప్యార్డు యాజమాన్యం నిర్ణయించినట్టు, ఆ మేరకు ఒప్పంద ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం. ఈ ఒప్పందంపై ముద్రించిన కరపత్రాలు గతంలో షిప్యార్డు ప్రాంగణంలో కనిపించడంతో కలకలం రేగింది. ఇలాంటి పరిణామాలతో కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ముందుకొచ్చి వెసల్స్ నిర్మాణానికి పూర్తిస్థాయిలో చర్యలు ప్రారంభించాలని వారు కోరుతున్నారు.
న్యూస్టుడే, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్