అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు.
తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని శిరీషాదేవి
రంపచోడవరం, న్యూస్టుడే: ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి నుంచి తెదేపా అభ్యర్థినిగా శిరీషాదేవి శుక్రవారం రిటర్నింగ్ అధికారి ప్రశాంత్కుమార్కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలో 11 మండలాలకు చెందిన మూడు పార్టీల నాయకులు పెద్దఎత్తున ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి తరలివచ్చారు. అంబేడ్కర్ కూడలి వద్ద శిరీషాదేవి మాట్లాడుతూ తనకు సైకిల్ గుర్తుపైన, భాజపా నుంచి అరకు ఎంపీగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతకు కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంత బాబు చేతిలో ఎమ్మెల్యే ధనలక్ష్మి కేవలం కీలుబొమ్మ అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూరమేష్, పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసు, మాజీ పరిశీలకులు యర్రా వేణుగోపాలరాయుడు, నాయకులు కారం సురేష్బాబు, అడబాల బాపిరాజు, భాజపా నాయకులు స్వప్నకుమారి, జనసేన నాయకులు కుర్ల రాజశేఖరరెడ్డి, పాపోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆస్తుల వివరాలు: రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి శుక్రవారం సబ్కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.ప్రశాంత్కుమార్కు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం తనకు చర, స్థిరాస్తుల కింద రూ.12,89,988లు, భర్త విజయభాస్కర్ పేరున రూ.11,49,000 మొత్తం రూ. 24,38,988 ఉన్నట్టు తెలిపారు. అలాగే అప్పుల కింద శిరీషాదేవికి రూ.1.10లక్షలు, భర్తకు రూ.8.12లక్షలు ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈమెపై ఎటువంటి కేసులు లేవు.
పాడేరు, న్యూస్టుడే: పాడేరు వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు తనపై కేసులేమీ లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. రూ.9.44 లక్షల విలువైన చరాస్తులు, రూ. 16.27 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 200 గ్రాముల బంగారం ఉందని చూపించారు. తన భార్య పేరిట రూ.1.20 లక్షల అప్పు ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
పథకాలను ప్రజలకు చేరువ చేస్తాం
[ 03-05-2024]
‘ఐదేళ్ల వైకాపా పాలనలో గిరిజన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. బతుకులు అతలాకుతలమయ్యాయి. గిరిజనులకు ప్రాణవాయువులాంటి జీవో నం.3ను అటకెక్కించారు. నిరుపేదలకు అందాల్సిన రాయితీ పథకాలను రద్దు చేశారు. పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. -
పండుటాకులపై పగ
[ 03-05-2024]
సామాజిక పింఛన్లపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, దివ్యాంగులు పింఛను సొమ్ము పొందేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
గిడ్డి ఈశ్వరి విజయానికి కృషి
[ 03-05-2024]
పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్నాయుడు తెలిపారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
భౌతిక దాడులు రాజ్యాంగ విరుద్ధం
[ 03-05-2024]
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. -
చిమ్మచీకట్లో డోలీమోత
[ 03-05-2024]
పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వంతెన నిర్మించాలని వేడుకున్నా, ఆమెకు పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదు. -
ఊపిరితీసిన వాగులు
[ 03-05-2024]
మన్యంలో పర్యటక ప్రాంతాలను చూద్దామని సరదాగా వచ్చిన వారికి తీరని విషాదం మిగిలింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడటం ఆయా కుటుంబాల వారిని శోకసంద్రంలో ముంచింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు