కోడింగ్ తెలిస్తే కొలువే..!
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు కొలువుల జాతర మొదలైంది. ఒక్కో విద్యార్థికి కనీసం మూడు నుంచి ఐదు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. రూ.4 లక్షల నుంచి రూ.45 లక్షల వరకూ ప్యాకేజీ అందుకుంటున్నారు. 250 నుంచి 300 ఐటీ సంస్థలు ఈ సారి కొలువులను అందించేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో
రూ.4 లక్షలు - రూ.45 లక్షల వరకు ప్యాకేజీ
పోటీ పడి ఇస్తున్న ఐటీ సంస్థలు
ఈనాడు, అమరావతి
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు కొలువుల జాతర మొదలైంది. ఒక్కో విద్యార్థికి కనీసం మూడు నుంచి ఐదు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. రూ.4 లక్షల నుంచి రూ.45 లక్షల వరకూ ప్యాకేజీ అందుకుంటున్నారు. 250 నుంచి 300 ఐటీ సంస్థలు ఈ సారి కొలువులను అందించేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో కళాశాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించేవారు. కొవిడ్ తర్వాత ఆ పంథా మార్చారు. ఆన్లైన్లోనే పరీక్ష, ఇంటర్వ్యూలు పూర్తి చేస్తున్నారు. ఆయా సంస్థలు ఆన్లైన్ లింక్ను ఇచ్చి.. దానిలో విద్యార్థులే నేరుగా తమ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా సంస్థలు అడిగే అర్హతల ఆధారంగా పరీక్షలకు హాజరు కావొచ్చు.
కొవిడ్కు ముందు వరకూ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై బయటకొచ్చే వారిలో 15 నుంచి 20 శాతం మందికి మాత్రమే కొలువులు వచ్చేవి. ఈ ఏడాది ఆయా సంస్థల పరీక్షలను రాస్తున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలొస్తున్నాయి. కంపెనీలు నిర్వహించే పరీక్షల్లో విద్యార్థులు చూపించే ప్రతిభ ఆధారంగానే ప్యాకేజీలు ఇస్తున్నారు. ఇంజినీరింగ్లో గ్రూపులతో సంబంధం లేకుండా ప్రధానంగా అర్హత పరీక్షలో కోడింగ్ స్కిల్స్ ఆధారంగా కంపెనీల ప్యాకేజీలు ఉంటున్నాయి. కోడింగ్ ఉంటే రూ.3.6 లక్షలు, మీడియం రూ.7 లక్షలు, హైకోడింగ్కు రూ.10 లక్షలు ఇస్తున్నారు. గతంలో ఇంగ్లిష్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ లాంటి వాటిని అర్హతగా చూసేవారు. ప్రస్తుతం అంతా కోడింగ్ ఆధారంగానే నడుస్తోంది.
ఒక్కొక్కరికీ 3-4 అవకాశాలు
ప్రస్తుతం పెద్ద ఐటీ సంస్థల మధ్య కూడా పోటీ పెరిగింది. ఒక్కో విద్యార్థికి కనీసం మూడు నుంచి ఐదు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు రావడంతో ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చే వారి వైపు వెళుతున్నారు. దీంతో విద్యార్థులను ఆకర్షించేందుకు గతంలో ఇచ్చే ప్యాకేజీలను కంపెనీలు ప్రస్తుతం పెంచాయి. గతంలో కనీస ప్యాకేజీ రూ.2.4 లక్షలుండేది.. ప్రస్తుతం రూ.4 లక్షలకు పెరిగింది. విద్యార్థి ఎంపికవగానే.. వర్క్ ఫ్రం హోంకు అవసరమైన ల్యాప్టాప్, డెస్క్టాప్ పంపించేస్తున్నాయి. ఫర్నిచర్ కోసం మరో రూ.11 వేలు ఇస్తున్నారు. వచ్చే ఆగస్టు నుంచి కంపెనీలకు వచ్చి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రస్తుతం విద్యార్థులకు లెటర్లు వచ్చాయి.
పాత వారికి..
రెండు జిల్లాల్లోని విద్యాసంస్థల్లో గత రెండేళ్లలో 25 వేల నుంచి 30 వేల కొలువులు వచ్చాయి. 2021, 2022, 2023 ఏడాదిలో చదివిన వారికి ఎక్కువగా అవకాశాలొస్తున్నాయి. ఒకసారి కళాశాల నుంచి ఇంజినీరింగ్ పూర్తిచేసి వెళ్లిపోయిన వారిని మరుసటి ఏడాది పిలిచి కొలువు ఇవ్వడం గతంలో జరిగేది కాదు. కానీ ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగులు కావాల్సి ఉండడంతో గత ఏడాది పూర్తిచేసిన వారిని, వచ్చే ఏడాది బయటకు రాబోతున్న వారిని కూడా తీసుకుంటున్నారు.
ఉద్యోగాలతో కంపెనీలు ఎదురుచూస్తున్నాయ్
- ఎన్.వి.సురేంద్రబాబు, ఏపీటీపీవో కన్సార్టియం ప్రధాన కార్యదర్శి
ఉమ్మడి కృష్ణా, గుంటూరుల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం కొలువుల జాతరే ఉంది. విప్రో, టీసీఎస్, అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ లాంటి అనేక సంస్థలు విద్యార్థుల కోసం అవకాశాలతో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్న వారికి కూడా ఇచ్చేస్తున్నారు. వీరికి కళాశాలలో ఉండగానే శిక్షణ పూర్తిచేయించి, వారు బయటకు రాగానే ఉద్యోగంలో చేరిపోయేలా ప్రణాళికతో వెళుతున్నాయి. కళాశాలల ప్రాజెక్ట్ వర్క్గా, ఇంటర్న్షిప్గా సదరు కంపెనీల్లోనే పూర్తిచేసేలా ముందే విద్యార్థులకు రూ.20 వేల వరకూ అందజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలోనే కంపెనీలకు ప్రాజెక్ట్లు అధికంగా రావడంతో మన విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. మెకానికల్ చదివే విద్యార్థులకు ఐటీ కంపెనీల్లో కనీసం రూ.4 లక్షల ప్యాకేజీతో ఈ ఏడాది ఉద్యోగాలు రావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
[ 30-04-2024]
విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. -
అణువణువూ నిఘా!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. -
వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
[ 30-04-2024]
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
[ 30-04-2024]
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న