రసబరితం..!
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది.
కృష్ణా జిల్లాలో 94 మంది పోటీ
ఎన్టీఆర్ జిల్లాలో 113 మంది...
పూర్తయిన నామపత్రాల ఘట్టం
ఈనాడు, అమరావతి: ‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. ప్రచార పర్వానికి తెరలేచింది. ఎండ వేడిమితో ప్రచారఘట్టం వేడెక్కింది. మరోవైపు ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుల్లోనూ కొంత గందరగోళం నెలకొంది. జనసేన గుర్తు... గాజుగ్లాసును స్వతంత్రులకు కేటాయించడంతో కూటమి అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో గాజుగ్లాసును పోలిన పెన్స్టాండ్ను కేటాయించడంపై జనసేన అభ్యంతరం తెలుపుతోంది. గుర్తింపు లేని ప్రాంతీయ పార్టీలకు, స్వతంత్రులకు గాజుగ్లాసు కేటాయించారు. జనసేన అభ్యర్థులకూ ఇదే గుర్తు కేటాయించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా కూటమి, అధికార వైకాపా మధ్య పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు రంగంలో ఉన్నారు.’’
ఆద్యంతం.. ఆసక్తికరం
విజయవాడ సెంట్రల్లో ఎక్కువగా 20 మంది.. అత్యల్పంగా 9 మంది నందిగామలో పోటీ పడుతున్నారు. 14 మంది కంటే ఎక్కువ మంది ఉంటే రెండు వీవీప్యాట్లు ఏర్పాటు చేస్తారు. ఒక వీవీప్యాట్లో మొత్తం 15 బటన్లు ఉంటాయి. 14 మంది అభ్యర్థులు.. ఒక నోటా బటన్ ఉంటుంది. సెంట్రల్లో నోటాతో కలిపి 21 బటన్లు వీవీప్యాట్లో ఉంచాలి. ఒకదానిలో 15 మంది, మరో దానిలో అయిదుగురు అభ్యర్థులు, చివరన నోటా బటన్ ఏర్పాటు చేస్తారు. విజయవాడ లోక్సభ పరిధిలో 17 మంది ఉన్నందున ఇక్కడ రెండు వీవీప్యాట్లు పెట్టాలి. విజయవాడ మధ్య, పశ్చిమకూ రెండేసి వీవీప్యాట్లు ఏర్పాటు చేయాలి. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఓటర్లు.... 17,04,077. శి మచిలీపట్నం పార్లమెంటుకు అత్యధికంగా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్లమెంటుకు రెండు వీవీప్యాట్లు వినియోగించాలి. కృష్ణా జిల్లాలో 15.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
నువ్వా నేనా..!
విజయవాడ లోక్సభ పరిధిలో నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. తాజా ఎంపీ కేశినేని శ్రీనివాస్ వైకాపా నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) తెదేపా కూటమి నుంచి బరిలో నిలవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇండియా కూటమి అభ్యర్థి భార్గవ్ కూడా వీరి బంధువే కావడం మరింత ఆసక్తికరం. విజయవాడ లోక్సభలో గత రెండు పర్యాయాలు తెదేపా జెండా ఎగరేసింది. ప్రస్తుతం తెదేపా నుంచి జంప్ అయిన కేశినేని నాని వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ అభ్యర్థులతో సమన్వయం లోపం ఉన్నట్లు వైకాపా వర్గాలే పేర్కొంటున్నాయి.
ఇదేంది గురూ...
ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్న జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఈ గుర్తును జనసేన పోటీలో లేని ప్రాంతాల్లో ఇతర వ్యక్తులకు కేటాయించింది. ఇది కొంత గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో బందరు ఎంపీ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. ఆయనకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. పార్లమెంటుకు పోటీపడే వారికి ఇతరులకు ఈ గుర్తు కేటాయించరు. కానీ పెన్నుస్టాండు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ రంగంలో ఉన్నారు. బందరు అసెంబ్లీ సెగ్మెంటులో చింతపల్లి మనోహర్కు, పామర్రులో ఎం.రాజమనోహర్, గన్నవరంలో వల్లభనేని వంశీకృష్ణలకు గాజుగ్లాసు కేటాయించారు. పెడన, గుడివాడ, పెనమలూరుల్లో ఎవరికీ గాజుగ్లాసు కేటాయించలేదు. విజయవాడ పార్లమెంటులో వై.కృష్ణకిశోర్ అనే స్వతంత్ర అభ్యర్థికి గాజుగ్లాసు కేటాయించారు. విజయవాడ తూర్పు నుంచి కూనపరెడ్డి దశరథ్, సెంట్రల్లో గొల్లపల్లి ఫణిరాజ్, మైలవరంలో వల్లభనేని నాగపవన్కుమార్, జగ్గయ్యపేటలో బేరోతుల ప్రకాశరావులకు గాజగ్లాసు గుర్తు కేటాయించారు. నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమలో ఎవరికీ కేటాయించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగేదెట్టా.. వేగేదెట్టా?
[ 21-05-2024]
ఎన్టీఆర్ జిల్లాలో ప్రకాశం బ్యారేజీ కింద ఆయకట్టు తక్కువగా ఉంది. ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఉంది. ఎన్టీఆర్ పరిధిలో మెట్టప్రాంతం ఎక్కువ కాగా.. సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు ఉంది. దానికి డిసెంబరులో నీరిస్తారు. -
చొరవ లేకనే చక్రబంధం!
[ 21-05-2024]
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు రోడ్డెక్కితే.. ఎప్పటికి గమ్యస్థానం చేరతామో తెలియకుంది. రద్దీ సమయాల్లో అయితే మరింత చికాకు పెడుతున్నాయి. -
ఓట్ల లెక్కింపుపై అవగాహన
[ 21-05-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా వేగవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డెమో నిర్వహించారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు
[ 21-05-2024]
‘ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎన్నికల అనంతరం హింస ఎక్కడా చెలరేగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా -
ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండండి
[ 21-05-2024]
ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను సోమవారం జిల్లా కలెక్టరు డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. -
సీతనపల్లి చెరువులో తాగునీటి చౌర్యం
[ 21-05-2024]
కృత్తివెన్ను మండలంలో 14 గ్రామ పంచాయతీలకు తాగునీటిని అందించే సీతనపల్లి సామూహిక రక్షిత నీటి పథకం చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. -
ఏపీ నరెడ్కో నూతన కార్యవర్గం ఎన్నిక
[ 21-05-2024]
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సెల్ (నరెడ్కో) ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గవర్నర్పేటలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు... -
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
[ 21-05-2024]
ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ టి.పెద్దిరాజు అన్నారు. -
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం
[ 21-05-2024]
కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత పేర్కొన్నారు. -
పలు రైళ్ల రద్దు
[ 21-05-2024]
విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.