వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
విజయవాడ నేరవార్తలు, న్యూస్టుడే : అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నందమూరినగర్లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో 24 కూపన్లు ఉన్న 5,250 షీట్ల అంశంపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు అజిత్సింగ్నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా ప్రింటింగ్ ప్రెస్ యజమానిని విచారించారు. నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కూపన్లకు ఆర్డర్ ఇచ్చాడని వెల్లడించారు. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శ్రీనివాసరావు చరవాణికి ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాని పూర్తి వివరాలు కూపీ లాగుతున్నారు.
కుక్కర్ల కోసం వేట : వైకాపా ఎన్నికల గుర్తుతో ఉన్న 1.26 లక్షల కూపన్లు దొరకడం విజయవాడలో కలకలం సృష్టించింది. ఓడిపోతున్నామనే భయంతోనే వైకాపా ప్రజలను ప్రలోభపెట్టేందుకు కుక్కర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుందని సర్వత్రా వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం దీన్ని విమర్శిస్తున్నారు. ఇది నిజంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని పేర్కొంటున్నాయి. కాగా 1.26లక్షల కూపన్లు పట్టుబడటంతో నగరంలో ఎక్కడో ఒక చోట కుక్కర్లు పెద్ద మొత్తంలో నిల్వ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న గోదాంలపై అధికారులు నిఘా పెట్టారు. ప్రధానంగా ఊరికి చివరగా పొలాల్లో బాణసంచా నిల్వ ఉంచేందుకు కొన్ని ప్రాంతాల్లో గోదాంలు ఉన్నాయని, అలాంటి చోట దాచి ఉంచే అవకాశం ఉందని కొంత మంది వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు దీనిపై దృష్టి పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగేదెట్టా.. వేగేదెట్టా?
[ 21-05-2024]
ఎన్టీఆర్ జిల్లాలో ప్రకాశం బ్యారేజీ కింద ఆయకట్టు తక్కువగా ఉంది. ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఉంది. ఎన్టీఆర్ పరిధిలో మెట్టప్రాంతం ఎక్కువ కాగా.. సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు ఉంది. దానికి డిసెంబరులో నీరిస్తారు. -
చొరవ లేకనే చక్రబంధం!
[ 21-05-2024]
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు రోడ్డెక్కితే.. ఎప్పటికి గమ్యస్థానం చేరతామో తెలియకుంది. రద్దీ సమయాల్లో అయితే మరింత చికాకు పెడుతున్నాయి. -
ఓట్ల లెక్కింపుపై అవగాహన
[ 21-05-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా వేగవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డెమో నిర్వహించారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు
[ 21-05-2024]
‘ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎన్నికల అనంతరం హింస ఎక్కడా చెలరేగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా -
ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండండి
[ 21-05-2024]
ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను సోమవారం జిల్లా కలెక్టరు డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. -
సీతనపల్లి చెరువులో తాగునీటి చౌర్యం
[ 21-05-2024]
కృత్తివెన్ను మండలంలో 14 గ్రామ పంచాయతీలకు తాగునీటిని అందించే సీతనపల్లి సామూహిక రక్షిత నీటి పథకం చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. -
ఏపీ నరెడ్కో నూతన కార్యవర్గం ఎన్నిక
[ 21-05-2024]
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సెల్ (నరెడ్కో) ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గవర్నర్పేటలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు... -
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
[ 21-05-2024]
ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ టి.పెద్దిరాజు అన్నారు. -
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం
[ 21-05-2024]
కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత పేర్కొన్నారు. -
పలు రైళ్ల రద్దు
[ 21-05-2024]
విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.