నాలుగేళ్లుగా నాన్చుడే పని
శంకుస్థాపన దగ్గరే ఆగిన నిర్మాణం
గుడివాడలో శిథిలమైన బస్టాండ్ ప్రాంగణం
గుడివాడ ఆర్టీసీ బస్టాండు
గుడివాడ ఆర్టీసీ బస్టాండును ఆధునికీకరిస్తా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు పెట్టి.. ఆయన చేతులమీదుగానే ఘనంగా ప్రారంభోత్సవం చేస్తాం.
- ఎమ్మెల్యే కొడాలి నాని కొన్నేళ్ల కిందట చెప్పిన మాటలివి..
ఈనాడు, అమరావతి
ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే మూడో పెద్ద మున్సిపాలిటీ గుడివాడ. జిల్లాలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి గుడివాడకు వేలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. విజయవాడ, ఏలూరు, నూజివీడు, మచిలీపట్నం లాంటి నగర, పట్టణాలకు మధ్యలో ఉండే ప్రాంతం. కానీ.. గుడివాడకు వెళ్లే రహదారులు ఎంత దారుణంగా ఉంటాయో.. అంతకంటే దయనీయంగా ఆర్టీసీ బస్టాండ్ ఉంది. బస్టాండ్ రూపురేఖలనే మార్చేస్తా, జగన్ పేరు పెడతా.. అంటూ గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే కొడాలి నాని.. ఐదేళ్ల పదవీకాలం కూడా త్వరలో ముగుస్తోంది. కానీ.. బస్టాండ్ అభివృద్ధికి కనీసం పునాది రాయి కూడా ఇంతవరకు వేయలేదు. నిర్మాణం చేపడతామంటూ వేసిన శిలాఫలకం కూడా శిథిలమైయింది. కానీ.. రెండేళ్లయినా.. బస్టాండ్ పనులు మాత్రం ఆరంభం కాలేదు. కొడాలి నాని మాటలకు.. చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతనేది.. గుడివాడ బస్టాండ్ను చూస్తే.. అర్థమవుతోంది.
ఒక్క ఇటుకా వేయలేదు..
గుడివాడ బస్టాండ్, డిపో ఆధునీకరణ పనులను రూ.21.31 కోట్లతో చేపడతామంటూ.. 2021 జులై 02న ఘనంగా శంకుస్థాపన చేశారు. అప్పటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)ను తీసుకొచ్చి మరీ భూమి పూజ చేయించారు. ఈ నిధుల్లో కొంత వెచ్చించి.. డిపో నిర్మాణం మాత్రమే చేపట్టారు. కానీ.. నిత్యం ప్రయాణికులకు అవసరమైన బస్టాండ్ను మాత్రం గాలికొదిలేశారు. పేర్ని నాని వచ్చి వెళ్లిన తర్వాత.. ఈ మూడేళ్లలో కనీసం ఇప్పటివరకూ ఒక్క ఇటుక కూడా వేసింది లేదు. రోజూ వందల బస్సులు గుడివాడకు వచ్చి వెళుతుంటాయి. వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి బస్టాండ్ ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. చిన్న వర్షం పడితే చాలు.. బస్టాండు పూర్తిగా నీటిలో మునిగిపోతుంది.
శిథిలమైన భవనాలు..
గుడివాడ బస్టాండు భవనాలు పూర్తిగా శిథిలమైపోయాయి. విజయవాడ నుంచి వచ్చే నాన్స్టాప్ బస్సులు ఆగే భవనం పూర్తిగా పెచ్చులూడిపోయి.. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ప్రయాణికులు నిలబడి ఉంటే.. పైనుంచి పెచ్చులు రాలి పడుతున్నాయి. అలాంటి దాంట్లోనే నిత్యం వందల మంది ప్రయాణికులు కూర్చుని బస్సుల కోసం వేచి చూస్తుంటారు. పైకప్పు కూలడం లాంటి ప్రమాదాలు జరిగితే.. ప్రాణనష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ శిథిల భవనాన్ని చూసి ప్రయాణికులు చాలామంది లోపలికి రాకుండా.. బయట ఎండలోనే నిలబడుతుంటారు.
ఎన్నాళ్లు నిర్మిస్తారు?
ఆర్టీసీ బస్టాండ్ నిర్మించడానికి ఎంతకాలం పడుతుంది. నా జీవితంలో ఎన్నడూ ఇలాంటి విచిత్రం చూడలేదు. ఏళ్లు గడిచిన కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఆ భారం కూడా ప్రజలపైనే పడుతుంది.
-డి.శ్రీకాంత్
ప్రజలు అవస్థలు పడుతున్నారు
ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు బస్టాండ్లో నానా అవస్థలు పడుతున్నారు. తర్వితగతిన పూర్తి చేస్తే ఇబ్బందులు తప్పుతాయి.
- కల్యాణ్
ఏటా ఖర్చు పెరుగుతోంది
ఏటా ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ అంచనా వ్యయం పెరుగుతోందే కానీ నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. గుత్తేదారులు నిర్మాణ పనులు నాన్చుడు ధోరణితో చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. తక్షణం ప్రభుత్వం స్పందించి బస్టాండ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి.
సయ్యద్ జబీన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగేదెట్టా.. వేగేదెట్టా?
[ 21-05-2024]
ఎన్టీఆర్ జిల్లాలో ప్రకాశం బ్యారేజీ కింద ఆయకట్టు తక్కువగా ఉంది. ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఉంది. ఎన్టీఆర్ పరిధిలో మెట్టప్రాంతం ఎక్కువ కాగా.. సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు ఉంది. దానికి డిసెంబరులో నీరిస్తారు. -
చొరవ లేకనే చక్రబంధం!
[ 21-05-2024]
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు రోడ్డెక్కితే.. ఎప్పటికి గమ్యస్థానం చేరతామో తెలియకుంది. రద్దీ సమయాల్లో అయితే మరింత చికాకు పెడుతున్నాయి. -
ఓట్ల లెక్కింపుపై అవగాహన
[ 21-05-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా వేగవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డెమో నిర్వహించారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు
[ 21-05-2024]
‘ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎన్నికల అనంతరం హింస ఎక్కడా చెలరేగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా -
ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండండి
[ 21-05-2024]
ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను సోమవారం జిల్లా కలెక్టరు డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. -
సీతనపల్లి చెరువులో తాగునీటి చౌర్యం
[ 21-05-2024]
కృత్తివెన్ను మండలంలో 14 గ్రామ పంచాయతీలకు తాగునీటిని అందించే సీతనపల్లి సామూహిక రక్షిత నీటి పథకం చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. -
ఏపీ నరెడ్కో నూతన కార్యవర్గం ఎన్నిక
[ 21-05-2024]
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సెల్ (నరెడ్కో) ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గవర్నర్పేటలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు... -
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
[ 21-05-2024]
ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ టి.పెద్దిరాజు అన్నారు. -
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం
[ 21-05-2024]
కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత పేర్కొన్నారు. -
పలు రైళ్ల రద్దు
[ 21-05-2024]
విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
-
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
-
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
-
ప్రజ్వల్.. లొంగిపో : కుమారస్వామి హితవు
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు