వైకాపా అరాచకీయం!
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది.
వాలంటీర్ల రాజీనామాల వెనుక పెద్ద కుట్రే
బూత్ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని ప్రయత్నాలు
ఏకంగా ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్న నాయకులు..
వాళ్లతోనే ఇంటింటికీ కొత్త మ్యానిఫెస్టో ప్రచారం
ఈనాడు, అమరావతి : ‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారికి వైకాపా కొత్త మ్యానిఫెస్టోతోపాటు బూత్ ఏజెంటుగా కూర్చోబెట్టాక ఏం చేయాలి? ఎలా చేయాలనే అంశాలపై వైకాపా కార్యాలయంలో తర్ఫీదు ఇచ్చినట్టు తెలిసింది. రాజీనామా చేసిన వాలంటీర్లను ప్రస్తుతం ఇంటింటికీ పంపి పింఛనుదారులు, లబ్ధిదారులను ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. మళ్లీ వైకాపాకే ఓటు వేయాలనీ, అప్పుడే జగన్ ముఖ్యమంత్రి అవుతారని, పింఛన్లతోపాటు అన్ని ప్రభుత్వ పథకాలను తామే ఇంటికే తీసుకొచ్చి అందిస్తామని.. రాజీనామా చేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి చెబుతున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ రోజు.. బూత్లోనే వీళ్లను ఏజెంట్లుగా కూర్చోబెట్టి.. వచ్చే ఓటర్లపై తీవ్ర ఒత్తిడి పెంచి.. ప్రభావితం చేయాలని నాని వర్గం కుట్ర చేస్తున్నట్టు సమాచారం.’’
ఉమ్మడి జిల్లాలో నెల రోజులకు పైగా..
వాలంటీర్లతో రాజీనామాలు చేయించేందుకు వైకాపా నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కొందరు వైకాపా నేతలను దీనికోసమే నియమించి మరీ.. రాజీనామాలు చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. రాజీనామాలు చేసే వారికి రెండు మూడు నెలల జీతాలు ముందే ఇచ్చేసి, తిరిగి అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని.. హామీలు ఇస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో వారితో బలవంతంగా రాజీనామాలు సైతం చేయించారు. విజయవాడ తూర్పులో కోడ్ అమలులో ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా.. పది రోజుల కిందట వాలంటీర్లతో రహస్య సమావేశం పెట్టారు. దేవినేని అవినాష్ కీలక అనుచరుడి ఆధ్వర్యంలో రాణిగారితోట ప్రాంతంలోని 17వ డివిజన్.. బాపనయ్యనగర్లో ఉన్న ఓ పాఠశాలకు సమీపంలో ఈ రహస్య భేటీ ఏర్పాటు చేశారు. రాజీనామా చేసేవాళ్లకి రూ.10వేలు ఇస్తామనీ, చేయని వారికి తమ ప్రభుత్వం మళ్లీ వస్తే.. ఇబ్బందులు తప్పవని బెదిరించి మరీ కొందరు వాలంటీర్లతో సంతకాలు చేయించారు.
ఓటర్లను ప్రభావితం చేయాలనే...
అన్ని నియోజకవర్గాల్లోనూ.. రాజీనామాలు చేయించేందుకు ఒకే రకమైన పంథా అనుసరించడం, వాలంటీర్లపై తీవ్ర ఒత్తిడి పెట్టడం, చేయని వారిపై కక్ష సాధింపులు తప్పవనే హెచ్చరికలు ఇవ్వడం వంటివి.. గత రెండు మూడు వారాలుగా బాగా ఎక్కువయ్యాయి. కేవలం ప్రచారంలో వారిని వాడుకునేందుకే.. ఇలా బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారని ఇప్పటివరకూ అంతా అనుకున్నారు. కానీ.. వారితో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా నేతలు పెద్ద ప్లానే రచించినట్టు తాజాగా అర్థమవుతోంది. వారిని ఎన్నికల రోజు పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా కూర్చోబెట్టి.. ఓటర్లను భారీగా ప్రభావితం చేయాలనేదే అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. వాలంటీర్లతో ఓ ప్రహసనంలా.. బలవంతంగా రాజీనామాలు చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత ఐదేళ్లుగా ఇంటింటికీ తిరిగి పట్టుపెంచుకున్న.. వాలంటీర్లతో ఎన్నికల రోజు ఓటర్లను బాగా ప్రభావితం చేయాలనేది వైకాపా అసలు కుట్ర.
ప్రతిపక్ష పార్టీల ఆందోళన...
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 22,400 మంది వాలంటీర్లు ఉండగా.. వీరిలో రెండు జిల్లాల్లో కలిపి రెండు వేల మంది వరకూ రాజీనామాలు చేశారు. గుడివాడలో ఇప్పటివరకూ 70 మందికి పైగా రాజీనామాలు చేశారు. వీరందరినీ ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా వాడుకోవాలని.. శిక్షణ ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే.. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా జరగడానికి ఆస్కారమే ఉండదనీ.. ప్రతిపక్ష తెదేపా, జనసేన, భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ బూత్లోనే కూర్చుని.. ఓటర్లను ప్రభావితం చేయడం కంటే దారుణం ఇంకొకటి ఉండదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలో రాజీనామా చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.2.50 లక్షలు చొప్పున ఇచ్చి వైకాపా తరఫున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ.. తెదేపా పట్టణాధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
[ 20-05-2024]
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
[ 20-05-2024]
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు