గురువులపై దమనకాండ
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయుల ఉద్యమబాట
ఉక్కుపాదం మోపిన వైకాపా ప్రభుత్వం
ఎన్టీఆర్ కలెక్టరేట్, మాచవరం, న్యూస్టుడే
బీఆర్టీఎస్ రోడ్డులో ఉపాధ్యాయుల నిరసన (పాత చిత్రం)
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ను రద్దు చేస్తామని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డే ప్రకటించారు. ఇచ్చిన హామీ నెరవేర్చమని తాము అడిగితే.. ఉక్కుపాదం మోపి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేశారని దుయ్యబడుతున్నారు. పీఆర్సీ అమలు, పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో నంబరు 117 రద్దు తదితర సమస్యలపై పోరు బాట పట్టారు. గృహాల వద్ద నిర్భందించడం, పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లి కూర్చోబెట్టడం, పాఠశాలల వద్ద పోలీసుల పహారాతో తమను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని.. గత అనుభవాలను తలచుకుంటూ.. గురువులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
బైండోవర్ల బెడద..
ఉద్యమాల నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసు స్టేషన్లకు తరలించారు. పలు సందర్భాల్లో వారి విడుదలకు రూ.2 లక్షల వరకు పూచీకత్తు కట్టాలని బెదిరింపుల పర్వానికి దిగారు. మరోవైపు బైండోవర్ కేసులను బనాయించడానికి వెనుకాడే ప్రసక్తే లేదని సంతకాలు చేయించుకోవంతో.. తాము బిక్కు బిక్కు మంటూ కాలం గడిపిన రోజులను నేడు ఉపాధ్యాయులు గుర్తుకు తెచ్చుకుంటూ గుండెలు బాదుకుంటున్నారు. విజయవాడ కేంద్రంగా జరిగే ఉద్యమాలకు విజయనగరం, విశాఖ, నెల్లూరు వంటి దూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలు ఒకటి రెండు రోజులు ముందుగానే బయల్దేరతారు. ఈక్రమంలో ఇలాంటి నాయకులను ముందస్తుగానే అరెస్టులు చేసి, తమ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేసిందని తూర్పారబడుతున్నారు. తమపై నమోదు చేసిన వివిధ పోలీసు కేసులను ఎత్తి వేస్తామని మంత్రి వర్గ ఉపసంఘం చర్చల్లో హామీ ఇచ్చినా.. సదరు కేసులను ఎత్తివేశారో లేదా అలానే ఉంచారో తెలియని పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తోంది
ప్రశ్నించే గొంతుకను వైకాపా ప్రభుత్వం నొక్కేస్తోంది. మా సమస్యలపై శాంతియుత ఆందోళనలకు దిగితే.. పలు అవాంతరాలు సృష్టించింది. రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్య్ర హక్కును హరించేలా వ్యవహరిస్తోంది.
ఓ ఉపాధ్యాయుడు
ఇంతటి అరాచకం ఎప్పుడూ చూడలేదు
ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో మేం ఎప్పుడూ చూడలేదు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 76 ఏళ్లలో పలు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయి. కానీ ఈ అయిదేళ్లలో మాపై సాగిన అరాచకం.. గతంలో ఎప్పుడూ లేదు. ఇది దుర్మార్గపు చర్య.
ఓ ఉపాధ్యాయుడు
మేం తీవ్రవాదులం కాదు
మే మేమైనా తీవ్రవాదులమా..? అరెస్టులు చేసి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లడానికి. ప్రతి ఒక్కరికీ వారి వారి వృత్తిని బట్టి వారికి కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని కాలరాయడానికి వైకాపా ప్రభుత్వం ప్రయత్నించింది. మమ్మల్ని ఈ అయిదేళ్లలో తీవ్రంగా వేధింపులకు గురిచేసింది.
ఓ ఉపాధ్యాయుడు
ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు
ఉద్యోగులకు ఇచ్చిన హామీని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఉపాధ్యాయుల సమస్యలపై శాంతియుతంగా చేపట్టే ధర్నాలకు అనుమతులు ఇవ్వలేదు. గత ప్రభుత్వాల్లోనూ మా సమస్యలపై పోరాడాం. ఆందోళనలు, ధర్నాలు చేశాం. ఏ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు.
ఓ ఉపాధ్యాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగేదెట్టా.. వేగేదెట్టా?
[ 21-05-2024]
ఎన్టీఆర్ జిల్లాలో ప్రకాశం బ్యారేజీ కింద ఆయకట్టు తక్కువగా ఉంది. ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఉంది. ఎన్టీఆర్ పరిధిలో మెట్టప్రాంతం ఎక్కువ కాగా.. సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు ఉంది. దానికి డిసెంబరులో నీరిస్తారు. -
చొరవ లేకనే చక్రబంధం!
[ 21-05-2024]
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు రోడ్డెక్కితే.. ఎప్పటికి గమ్యస్థానం చేరతామో తెలియకుంది. రద్దీ సమయాల్లో అయితే మరింత చికాకు పెడుతున్నాయి. -
ఓట్ల లెక్కింపుపై అవగాహన
[ 21-05-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా వేగవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డెమో నిర్వహించారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు
[ 21-05-2024]
‘ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎన్నికల అనంతరం హింస ఎక్కడా చెలరేగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా -
ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండండి
[ 21-05-2024]
ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను సోమవారం జిల్లా కలెక్టరు డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. -
సీతనపల్లి చెరువులో తాగునీటి చౌర్యం
[ 21-05-2024]
కృత్తివెన్ను మండలంలో 14 గ్రామ పంచాయతీలకు తాగునీటిని అందించే సీతనపల్లి సామూహిక రక్షిత నీటి పథకం చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. -
ఏపీ నరెడ్కో నూతన కార్యవర్గం ఎన్నిక
[ 21-05-2024]
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సెల్ (నరెడ్కో) ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గవర్నర్పేటలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు... -
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
[ 21-05-2024]
ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ టి.పెద్దిరాజు అన్నారు. -
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం
[ 21-05-2024]
కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత పేర్కొన్నారు. -
పలు రైళ్ల రద్దు
[ 21-05-2024]
విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్.. లొంగిపో : కుమారస్వామి హితవు
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
-
దోషులను తప్పించి... అమాయకులను ఇరికించి..!
-
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
-
ఉద్యోగుల భవన్ అమ్మేశారు.. నాలుగో తరగతి వేతనజీవుల ఆందోళన