ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై వైకాపా వీడియో
వైకాపా నేతలు విడుదల చేసిన వీడియోలో తెలంగాణ ఆటో గురించి చెబుతున్న పట్టాభిరామ్
పటమట (విజయవాడ), న్యూస్టుడే : వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. సోమవారం అశోక్నగర్లోని తెదేపా తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా పాలనలో తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంటూ దేవినేని అవినాష్ విడుదల చేసిన ఫేక్ వీడియోను ప్రొజెక్టర్పై ప్రదర్శించి అందులోని అసత్యాలను ఎండగట్టారు. పట్టాభి మాట్లాడుతూ నిజం చెప్తే అవినాష్ తల ముక్కలయ్యే శాపం ఉందని, అందుకే ఆయన ఏనాడూ నిజాలు చెప్పరన్నారు. వీడియోలతో ఫేక్ ప్రచారం చేయడం అవినాష్ నైజమన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేకపోవడంతో తెలంగాణ వెళ్లి వీడియో తీసుకోవాల్సిన దుస్థితికి దిగజారారన్నారు. వైకాపా నేతలను చూన్తే జాలి వేస్తోందన్నారు. గతంలో కూడా ఇలానే రిటైనింగ్ వాల్ తానే కట్టించానని అవినాష్ ప్రచారాలు చేస్తుంటే, తాము ఆధారాలతో సహా వీడియో విడుదల చేసి అవినాష్ తీరును ఎండకట్టామన్నారు. వైకాపా పాలనలో నియోజకవర్గంలో రూ.650 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ గద్దె రామ్మోహన్ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే నియోజకవర్గంలో 2019-2024 వరకు కేవలం రూ.173 కోట్ల నిధులు కేటాయించగా అందులో రూ.98.9 కోట్ల మేర పనులు జరిగినట్లు ప్రభుత్వ అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారని పేర్కొన్నారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి పక్కన రూ. వందల కోట్ల విలువైన స్థలాన్ని నెహ్రూకి కట్టబెట్టరన్నారు. ఆ స్థలంలో విలువైన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని అందుకే హైదరాబాద్ అంటే అవినాష్కు ఇష్టమన్నారు. వైకాపా పాలనలో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, కానీ అవినాష్ ఆస్తుల మాత్రం అభివృద్ధి చెందాయన్నారు. 2019, 2024 ఎన్నికల అఫిడివిట్లను చూపించారు. గుణదల దొడ్డిలో సెటిల్మ్మెంట్లలో రాయించుకున్న ఆస్తులే ఇందుకు కారణమన్నారు. కొవిడ్ సమయంలో గుణదల ముఠా ప్రభుత్వాసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడీసివర్ ఇంజక్షన్లు అమ్ముకుని పేద ప్రజల ఉసురు తీసిందన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధిపై తయారు చేసిన వీడియోలను అంశాల వారీగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, అవినీతి, హత్యా రాజకీయాలపై జగనాసుర రక్త చరిత్ర, అరాచకపాలన అంతం, కూటమి పంతం పేరుతో ఎన్డీఏ కూటమి రూపొందించిన ఛార్జిషీట్ కరదీపికను ఆవిష్కరించారు. జడ్పీ మాజీ చైర్పర్సన గద్దె అనూరాధ, భాజపా నేత పోతంశెట్టి నాగేశ్వరరావు, జనసేన నేత అమ్మిశెట్టి వాసు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
[ 20-05-2024]
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
[ 20-05-2024]
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు