logo

అరిటాకులు కోసుకొస్తూ అనంతలోకాలకు

బతుకు తెరువు కోసం అరటి ఆకులు తీసుకొచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి గుండె పోటుకు గురై ప్రాణాలొదిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది.

Published : 29 Jan 2023 05:27 IST

చల్లపల్ల్లి, న్యూస్‌టుడే: బతుకు తెరువు కోసం అరటి ఆకులు తీసుకొచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి గుండె పోటుకు గురై ప్రాణాలొదిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది. చల్లపల్లి మండలం పరిధిలోని వెలివోలుకు చెందిన పెనుముచ్చ బాబూరావు(56) వృత్తిరీత్యా అరటి ఆకుల వ్యాపారి. శనివారం అరటి ఆకులు తీసుకొచ్చేందుకు రావిలంక వెళ్లి తిరిగి వస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. కృష్ణా నది మధ్యలో ఇసుక దిబ్బపై అరటాకుల కట్టపై పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు వెళ్లి చూడగా అప్పటికే మరణించి ఉన్నాడు. బాబూరావుకి తల్లి, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని