కట్టేది లేదు.. కష్టపెట్టుడే..
‘‘గన్నవరం విమానాశ్రయంలో రూ.470 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా ఆరంభమైన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు అతీగతీ లేకుండా సాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. 2022 చివరికే పూర్తిచేసి అందుబాటులోకి తేవాలనే నిర్దేశిత గడువు ఎప్పుడో దాటిపోయినా.. జగన్ సర్కారు కనీసం కన్నెత్తి చూడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన విమానాశ్రయం అభివృద్ధి సలహా కమిటీ కూడా నాలుగు నెలల కిందట సమావేశమై.. టెర్మినల్ పనులపై తీవ్ర అసంతృప్తి తెలిపింది.
ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను వదిలేసిన జగన్ సర్కారు
లక్షలాది విమాన ప్రయాణికులకు అత్యంత కీలకం
ఒక్కొక్కటిగా వెళ్లిపోయిన విమానయాన సంస్థలు
టెర్మినల్కు వెళ్లే రహదారి పరిస్థితి ఇదీ..
ఈనాడు - అమరావతి: ‘‘గన్నవరం విమానాశ్రయంలో రూ.470 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా ఆరంభమైన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు అతీగతీ లేకుండా సాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. 2022 చివరికే పూర్తిచేసి అందుబాటులోకి తేవాలనే నిర్దేశిత గడువు ఎప్పుడో దాటిపోయినా.. జగన్ సర్కారు కనీసం కన్నెత్తి చూడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన విమానాశ్రయం అభివృద్ధి సలహా కమిటీ కూడా నాలుగు నెలల కిందట సమావేశమై.. టెర్మినల్ పనులపై తీవ్ర అసంతృప్తి తెలిపింది. మరో తొమ్మిది నెలల్లో పూర్తిచేయకపోతే ఊరుకోమని.. చెప్పి వెళ్లిపోయింది. కానీ.. ఆ తర్వాత కనీసం విమానాశ్రయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటికే వాళ్లు ఇచ్చిన సమయం నాలుగు నెలలు దాటిపోయింది. పరిస్థితి అలాగే ఉంది. రాష్ట్రానికి చెందిన లక్షల మంది విమాన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే ఈ టెర్మినల్ విషయంలో ప్రభుత్వం, జిల్లా అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొత్త విమానయాన సంస్థలు రాకపోగా.. గతంలో ఉన్నవి సైతం ఒక్కొక్కటిగా ఇక్కడి నుంచి సర్వీసులను ఆపేసి వెళ్లిపోతున్నాయి.’’
గన్నవరానికి పెరుగుతున్న విమాన ప్రయాణికుల అవసరాలను తీర్చే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కోసం గత చంద్రబాబు ప్రభుత్వం త్వరితగతిన రైతుల నుంచి భూసేకరణ చేపట్టి భారత విమానయాన సంస్థ(ఏఏఐ)కు అప్పగించింది. ఆ తర్వాత టెండర్ల నుంచి ప్రతి దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తూ, ఏఏఐతో మాట్లాడుతూ 2018 డిసెంబరులో అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న సురేష్ప్రభుతో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. 2020 ఆగస్టు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తయి.. 2021 జనవరిలో పనులు మొదలయ్యాయి. రెండేళ్లలో అంటే.. 2022 డిసెంబరు నాటికి టెర్మినల్ను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలనే లక్ష్యం దాటిపోయి.. ఏడాది కావస్తోంది. ప్రస్తుతం రెండంతస్తుల టెర్మినల్ భవనం పనులు శ్లాబు దశకు వచ్చి.. మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. మరో రెండేళ్లయినా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
కనీస పర్యవేక్షణ లేకనే... గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై తెదేపా ప్రభుత్వం అత్యంత ఆసక్తి చూపింది. రూ.160 కోట్లతో దేశీయ టెర్మినల్ భవనాన్ని కేవలం ఏడాదిలోనే నిర్మించి.. అందుబాటులోకి తెచ్చింది. అంతర్జాతీయ సర్వీసుల సేవలను గతంలో ఉన్న పాత టెర్మినల్ను ఆధునికీకరించి అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ రెండు సేవలూ ఒకే టెర్మినల్ నుంచి నిర్వహించేలా.. వచ్చే మూడు దశాబ్దాల అవసరాలకు తగ్గట్టుగా రూ.470 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రకృతి విపత్తులను తట్టుకునేలా స్టీల్ అండ్ గ్లాస్ స్ట్రక్చర్తో ఈ భవనం నిర్మించాలనేది ప్రణాళిక. భూసేకరణ సహా అన్ని ప్రక్రియలనూ బాబు ప్రభుత్వం త్వరితగతిన చేపట్టింది. కానీ.. భవన నిర్మాణ ఆరంభ సమయానికి ప్రభుత్వం మారడంతో.. అప్పటి నుంచి పట్టించుకునే వాళ్లు లేక పనులు మందగించాయి.
విమానయాన సంస్థలు రావాలంటే.. భారీ బోయింగ్లను నడిపే అంతర్జాతీయ విమానయాన సంస్థలు గన్నవరం నుంచి సేవలు ఆరంభించాలంటే పొడవైన రన్వే, అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఉండాలి. అందుకే.. రన్వే విస్తరణ, టెర్మినల్ నిర్మాణాన్ని గత ప్రభుత్వంలో ఆరంభించారు. రన్వే విస్తరణ పూర్తయింది. ప్రస్తుతం 11 వేల అడుగులకు పైగా పొడవైన రన్వే అందుబాటులో ఉంది. అతిపెద్ద విమాన సర్వీసులు తేలికగా దిగేందుకు, ఎగిరేందుకు వీలుంది. ఇప్పటికే ఎయిరిండియా వన్ వంటి విమానాలు గన్నవరంలో దిగి వెళ్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం మాత్రం జాప్యం జరుగుతోంది.
అంతర్జాతీయ సౌకర్యాలొస్తాయ్...
ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పూర్తయితే అంతర్జాతీయ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ఇదే అతిపెద్ద టెర్మినల్్ భవనం అవుతుంది. ప్రయాణికుల సామర్థ్యం గన్నవరానికి పుష్కలంగా ఉంది. ఐదేళ్ల కిందటే ఏటా కనీసం 12 లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. పూర్తిస్థాయిలో అన్ని దేశాలు, నగరాలకు సర్వీసులు అందుబాటులోకి వస్తే.. దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు వస్తారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను.. 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. ఒకేసారి 1200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. అధునాతన 24 చెన్ఇన్కౌంటర్లు, ఆరు ఏరోబ్రిడ్జిలు, 14 ఇమ్మిగ్రేషన్ పాయింట్లు, నాలుగు కస్టమ్స్ కౌంటర్లు, ఆధునిక కన్వేయర్బెల్ట్లు, బ్యాగేజీ హ్యాండ్లింగ్, సెంట్రల్ ఏసీ, పటిష్ఠ భద్రతా వ్యవస్థ సమకూరుతుంది.
నత్తనడకన సాగుతున్న నిర్మాణాలు
వందేభారత్ సర్వీసుల్లోనే లక్షల మంది..
గన్నవరం విమానాశ్రయంలో కొవిడ్కు ముందు వరకు నెలకు లక్ష మంది చొప్పున ప్రయాణించారు. వందేభారత్ మిషన్లో భాగంగా గన్నవరానికి నడిపిన ప్రత్యేక సర్వీసుల్లోనే ఏడాదిలో.. రెండున్నర లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు విదేశాల నుంచి వచ్చారు. విమానాశ్రయం నుంచి కేవలం దేశంలో తొమ్మిది నగరాలకే సర్వీసులు నడిపినా.. భారీగా ప్రయాణికులు పెరిగారు. దేశంలోనే అత్యధిక ప్రయాణికుల వృద్ధి కలిగిన విమానాశ్రయాల జాబితాలో గన్నవరం వరుసగా నాలుగేళ్లు మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని నగరాలు, అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమైతే.. భారీగా రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే.. వచ్చే 20 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణం ఆరంభించారు. కానీ.. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం ఎలా సాగుతోందనేది పర్యవేక్షించేవాళ్లు కూడా లేకపోవడం బాధాకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
[ 01-05-2024]
‘నా మానసిక పరిస్థితి బాగోలేదు. చాలా ఒత్తిడిలో ఉన్నా. అమ్మ, భార్య, పిల్లలంటే నాకు ప్రాణం. నేను చనిపోయాక వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చేశానని’’ డాక్టర్ శ్రీనివాస్ తన ఫోన్లో వాయిస్ రికార్డు చేశారు. -
శ్రమజీవికీ ద్రోహ ‘మే’..!
[ 01-05-2024]
తెల్లవారుజామునే నిద్ర లేచి.. ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని... చద్దిబువ్వ మూటకట్టుకుని.. పొట్టకూటి కోసం అడ్డాలకు చేరుకుంటారు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు. ఎవరైనా కాస్త పని ఇప్పించకపోతారా? అని వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉంటారు -
బాబోయ్ అన్నా... బే‘ఖాతా’ర్..!
[ 01-05-2024]
మే.. సామాజిక పింఛన్లను బ్యాంకుల్లో వేయడమంటే.. వృద్ధులు, దివ్యాంగులను ఎండల్లో ముప్పుతిప్పలు పెట్టడమే. కావాలనే... ఎన్నికలకు ముందు వారిని వేధించి.. ప్రాణాలమీదకొచ్చేలా చేయడమే. -
ఉప కారాగారం వార్డర్ ఆత్మహత్య
[ 01-05-2024]
స్థానిక ఉప కారాగారంలో వార్డర్గా పని చేస్తున్న దాసరి నాగ శివకుమార్ (37) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్థానిక ఐదో వార్డులో ఒక భవనం పై అంతస్తులో ఉన్న సింగిల్ పోర్షన్లో అద్దెకు ఉంటున్నారు. -
‘వైకాపా అరాచకాలకు ఓటుతో స్వస్తి పలకాలి’
[ 01-05-2024]
రాష్ట్రంలోనూ, గన్నవరంలోనూ వైకాపా అరాచకాలకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కునే ఆయుధంగా మలుచుకోవాలని బాపులపాడు మండలం రంగన్నగూడెం మాజీ సర్పంచి, వైకాపా నాయకురాలు ఆళ్ల నాగమణి పేర్కొన్నారు. -
జ్యోతిర్లింగ యాత్రకు ప్రత్యేక రైలు
[ 01-05-2024]
యాత్రికుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ సంస్థ జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనుంది. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం : సజ్జల
[ 01-05-2024]
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెదేపా, జనసేన పార్టీ దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
జ్యోతిసురేఖకు ఘన స్వాగతం
[ 01-05-2024]
ప్రపంచ అర్చరీ పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన వన్నెం జ్యోతిసురేఖ మంగళవారం ఉదయం దిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. -
కూటమితోనే రాజ్యాంగ పరిరక్షణ: బాలశౌరి
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ తన సొంత రాజ్యాంగం అమలు చేశారని, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. -
పేదలకు పాట్లు.. వైకాపా నాయకులకు రూ.కోట్లు
[ 01-05-2024]
గుడివాడలో ఐదేళ్ల జగన్ ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ.. ఎమ్మెల్యే నాని అండతో అతని అనుచరులు మాత్రం భారీగానే ఆర్జించారు. -
గుడివాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్
[ 01-05-2024]
ఐపీఎల్లో జరిగే బెట్టింగ్ తీరుతెన్నులు ఇది. ఓవర్లో రెండు సిక్స్లు కొడితే పందెం కాసిన బెట్టింగ్రాయుళ్లకు డబ్బులు చెల్లించాలి. అదే కొట్టలేకపోతే బెట్టింగ్ రాయుళ్లు కట్టిన సొమ్ము బుకీలకు పంపాలి. -
ఎన్నికల నిర్వహణకు సహకరించండి: కలెక్టర్
[ 01-05-2024]
జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!