AP News: అనంతలో.. ఆ ముగ్గురి పాజిటివ్పై ఉత్కంఠ
ఒమిక్రాన్.. అనే కొవిడ్ వేరియంట్ జిల్లా జనాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జిల్లా పొరుగున బెంగళూరులో ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. బెంగళూరు-అనంతకు రాకపోకలు నిత్యకృత్యం. దీంతో ఏ రూపంలోనైనా ఆ మహమ్మారి జిల్లాలోకి ప్రవేశిస్తుందన్న భయం ఆవరించింది.
వేరియంట్ గుర్తింపునకు సీసీఎంబీకి నమూనాలు
జిల్లా సచివాలయం(అనంతపురం), న్యూస్టుడే: ఒమిక్రాన్.. అనే కొవిడ్ వేరియంట్ అనంతపురం జిల్లా జనాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జిల్లా పొరుగున బెంగళూరులో ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. బెంగళూరు-అనంతకు రాకపోకలు నిత్యకృత్యం. దీంతో ఏ రూపంలోనైనా ఆ మహమ్మారి జిల్లాలోకి ప్రవేశిస్తుందన్న భయం ఆవరించింది. జిల్లావాసులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లి వస్తున్నారు. ఒమిక్రాన్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో నవంబరు 1 నుంచి ఈనెల 4వ తేదీ దాకా ఎంతమంది విదేశాల నుంచి వచ్చారన్న దానిపై జేసీ డాక్టర్ సిరి సారథ్యంలో అనంత బీసీ స్టడీ సర్కిల్లో ప్రత్యేక బృందం నిశితంగా ఆరా తీస్తోంది. ఆయా విమానాశ్రయాల నుంచి జిల్లాకు చేరిన విదేశీ ప్రయాణికుల జాబితాలను తెప్పించారు. నవంబరు 30 దాకా 274 మంది, ఈనెల 1 నుంచి 4వరకు 197 మంది.. మొత్తం 471 మంది జిల్లాకు చేరినట్లు తేలింది. 471 మందిలో తొలి విడతగా 410 మంది చిరునామాలను గుర్తించే పనిలో ఉన్నారు.
252 మందికి పరీక్ష: తొలి విడత 410 మంది జాబితాలో ఇప్పటికే 252 మందిని గుర్తించారు. వీరందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ముగ్గురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే... ఏ వేరియంట్ సోకిందన్న దానిపై గుర్తించేందుకు ప్రత్యేక నమూనాలను హైదరాబాద్లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)కి పంపించారు.
కాంటాక్టు నమూనాలపై దృష్టి: 252 మంది నమూనాలను పరీక్షించగా.. తక్కిన 388 మందిలో... అనంత చిరునామా ఇచ్చిన 89 మంది వివరాలు తెలియడం లేదు. నిర్దేశిత చిరునామాల్లో లేరు. మరికొందరు తప్పుడు చిరునామాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి జిల్లాకు చేరిన వారి ప్రథమ, ద్వితీయ కాంటాక్టుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. 582 మందిని ప్రైమరీ కాంటాక్టుగా గుర్తించగా.. వీరిలో 139 మంది నమూనాలు సేకరించారు. మరో 906 మందిని సెకెండరీ కాంటాక్టుగా గుర్తించగా.. వీరిలో 129 మంది నుంచి నమూనాలు తీశారు. వీటిని వ్యాధి నిర్ధారణకు ప్రయోగశాలలకు పంపించారు.
భయపడాల్సిన పని లేదు: సిరి, జేసీ
విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో ముగ్గురికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీరిలో ఏ వేరియంట్ వైరస్ ఉందో తెలుసుకోడానికి హైదరాబాద్ సీసీఎంబీకి ప్రత్యేక నమూనాలు పంపించాం. ఆ ముగ్గురి ఆరోగ్యం బాగుంది. భయపడాల్సిన అవసరం లేదు. మహమ్మారిని ఎదుర్కోడానికి జిల్లా అధికార యంత్రాంగం అన్నివిధాలా సిద్ధంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!