వేడుకల్లో భాగస్వాములవుదాం
భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బసంత్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సిరసాని హిల్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్లో వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మైదానంలో ముందస్తు సన్నాహక సాధనలో భాగంగా పోలీసు కవాతు, బందోబస్తు, ఇతరత్రా
పరేడ్ గ్రౌండ్లో సన్నాహక సాధన పరిశీలిస్తున్న కలెక్టర్ బసంత్కుమార్, ఎస్పీ రాహుల్దేవ్సింగ్
పుట్టపర్తి, పుట్టపర్తి గ్రామీణం, న్యూస్టుడే: భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బసంత్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సిరసాని హిల్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్లో వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మైదానంలో ముందస్తు సన్నాహక సాధనలో భాగంగా పోలీసు కవాతు, బందోబస్తు, ఇతరత్రా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం సన్నాహక సన్నద్ధతలో భాగంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో జిల్లా ఎస్పీ రాహుల్దేవ్సింగ్ నేతృత్వంలో సాయుధ పోలీసుల బలగాల వందనం, పోలీసు జాగిలాల ప్రదర్శన, డాగ్ స్క్వాడ్ సలామిని పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్, పీడీ నర్సయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, తహసీల్దార్ భాస్కరనారాయణ తదితరులు ఉన్నారు.
నేటి కార్యక్రమాలు ఇలా..
పుట్టపర్తి, పుట్టపర్తి గ్రామీణం: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు తొలిసారిగా సోమవారం సిరసాని కొండ ప్రాంతంలో ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణతో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరై పతాక ఆవిష్కరణ చేయనున్నారు. సోమవారం వేడుకల వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
* ఉదయం: 8.30 గంటలకు పరేడ్ గ్రౌండుకు చేరుకోవడం, 8.40కి పరేడ్ గ్రౌండ్ను కమాండర్ బాధ్యతలు తీసుకోవడం, 8.55 గంటలకు పరేడ్ గ్రౌండ్లోకి జిల్లా ఎస్పీ ఆగమనం, 8.57కు జిల్లా కలెక్టర్ ఆగమనం, 9.05కు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆగమనం, పతాక ఆవిష్కరణ, పోలీసు దళం గౌరవ వందన స్వీకరణ, 9.15కు మంత్రి సందేశం 9.35కు సాయుధ దళాల మార్చ్ఫాస్ట్, 9.55కు అభివృద్ధిపై ఆయా ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన, 10.05కు బాలబాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు, 10.45కు ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అవార్డుల ప్రదానం, 11.15కు స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు, ఆహ్వానితులను కలిసి అభినందనలు తెలపటం11.20 గంటలకు ప్రభుత్వశాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ల సందర్శనతో కార్యక్రమాలు ముగుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM