logo

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని డీఎల్‌ఎస్‌ఏ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి గరికపాటి దీనబాబులు సయుక్త ప్రకటనలో కోరారు.

Published : 30 Mar 2023 03:44 IST

అనంతపురం (మూడోరోడ్డు): జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని డీఎల్‌ఎస్‌ఏ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి గరికపాటి దీనబాబులు సయుక్త ప్రకటనలో కోరారు. ఉమ్మడి అనంత జిల్లాలోని వివిధ కోర్టుల్లో మే 13న (రెండో శనివారం) నిర్వహించే అదాలత్‌లో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సివిల్‌ తగాదాలతో పాటు ప్రమాదభరిత కేసులు, చెక్‌బౌన్సు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగ్గ క్రిమినల్‌, పన్నుల కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యయప్రయాసలు పడకుండా లోక్‌ అదాలత్‌లో సులభంగా, సత్వర న్యాయం పొందటానికి వీలవుతుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని