దేవరకొండ పైనుంచి దూసుకెళ్లిన కారు
బుక్కరాయసముద్రం శివారులో ఉన్న దేవరకొండ పై నుంచి సోమవారం ఉదయం 11.30 గంటలకు ఓ కారు దాదాపు వంద అడుగుల కిందకు పడిపోవడంతో.. దానిలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల యజమాని దుర్మరణం పాలయ్యారు.
కాలిన గాయాలతో ప్రైవేటు పాఠశాల యజమాని దుర్మరణం
దుర్ఘటనపై పలు అనుమానాలు
ఉమాపతి (పాత చిత్రం)
బుక్కరాయసముద్రం, న్యూస్టుడే: బుక్కరాయసముద్రం శివారులో ఉన్న దేవరకొండ పై నుంచి సోమవారం ఉదయం 11.30 గంటలకు ఓ కారు దాదాపు వంద అడుగుల కిందకు పడిపోవడంతో.. దానిలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల యజమాని దుర్మరణం పాలయ్యారు. అనంతపురం పట్టణం వేణుగోపాల్నగర్కు చెందిన ఉమాపతి (55) శ్రీవిద్యానికేతన్ పేరుతో కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం కారు డ్రైవర్ ఉజ్జినప్పతో కలసి కారులో బుక్కరాయసముద్రం శివారులో ఉన్న దేవరకొండపైకి దైవదర్శనం కోసమని వెళ్లారు. దర్శనం చేసుకున్న తర్వాత ఉమాపతి నేను కారులో కూర్చుని ఫోన్లో మాట్లాడుతుంటాననీ.. నువ్వు గుడిలోకి వెళ్లిరావాలని చెప్పారు. డ్రైవర్ తిరిగి వచ్చేలోపు కారు ఒక్కసారిగా కింది వైపు కదలడం గమనించాడు. డ్రైవర్ సార్... సార్... అని అరచినా కారు ఆగకుండా రోడ్డు పక్కనే రక్షణ కంచెను దాటి 100 అడుగుల కింద ఉన్న మరో రోడ్డుపై పడిపోయింది. దీంతో ఉమాపతి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై కాలిన గాయాలు ఉండటంతో పోలీసులు కారులో మంటలు ఎలా వ్యాపించాయన్నది పరిశీలిస్తున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కిందకు దూసుకువెళుతున్న కారు
ప్రమాదమా.. ఆత్మహత్యా?
యజమాని ఉమాపతి కారుతో సహా కాలిన గాయాలతో దేవరకొండపై నుంచి పడి మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. కారులో కూర్చుని మాట్లాడుతున్న వ్యక్తికి మంటలు ఎలా వ్యాపించాయి, కారు కిందకు ఎలా పడిపోయిందని పోలీసులు విచారిస్తున్నారు. ఇది ప్రమాదమా.. లేదా ఆత్మహత్యా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఎస్ఐ జమాల్బాషాను వివరణ కోరగా.. డ్రైవర్ ఉజ్జినప్ప, మృతుడి కుటుంబ సభ్యులు ప్రమాదం జరగడం వల్లే మరణించాడని ఫిర్యాదు ఇచ్చారన్నారు. దీనిపై సీఐ, డీఎస్పీలతో చర్చిస్తున్నామనీ.. పూర్తిస్థాయి విచారణ తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
ఘటనా స్థలంలో బోల్తా పడిన కారు, పక్కనే మృతదేహం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?