logo

పలువురు తహసీల్దార్లకు స్థానచలనం

జిల్లాలో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లకు రెండోవిడత బదిలీలు జరిగాయి. ఈ మేరకు కలెక్టర్‌ గౌతమి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి విజయలక్ష్మిని డ్వామాకు బదిలీ చేశారు.

Published : 04 Jun 2023 06:08 IST

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లకు రెండోవిడత బదిలీలు జరిగాయి. ఈ మేరకు కలెక్టర్‌ గౌతమి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి విజయలక్ష్మిని డ్వామాకు బదిలీ చేశారు. కలెక్టరేట్‌ కేఆర్‌సీసీలో ఉన్న ఈశ్వరయ్యశెట్టిని మెజిస్టీరియల్‌ విభాగం పర్యవేక్షకుడిగా, శ్రీసత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న నీలకంఠారెడ్డిని అనంతపురం కలెక్టరేట్‌ కేఆర్‌సీసీ విభాగానికి, కలెక్టరేట్‌లోని మెజిస్టీరియల్‌ సెక్షన్‌ పర్యవేక్షకుడు తిరుమలరెడ్డిని అనంతపురం ఆర్డీఓ కార్యాలయ ఏఓగా బదిలీ చేశారు. ఇక్కడ ఏఓగా పనిచేస్తున్న సి.విశ్వనాథ్‌ను యాడికి తహసీల్దారుగా బదిలీ చేశారు.. కానీ, డిప్యుటేషన్‌పై అనంతపురం కలెక్టరేట్‌లో నియమించారు. యాడికి తహసీల్దారు జి.అలెగ్జాండర్‌ కలెక్టరేట్‌లోని భూసంస్కరణల ప్రత్యేక తహసీల్దారుగా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడే కొనసాగాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని