logo

కల్యాణ వైభోగమే..

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది.

Published : 18 Apr 2024 04:08 IST

పుట్టపర్తి, న్యూస్‌టుడే : పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. సాయికుల్వంత్‌ మందిరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలను సత్యసాయి ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జె.రత్నాకర్‌, హిమవాహిని దంపతులు అందజేశారు. కల్యాణం తిలకించిన దేశ, విదేశీ భక్తులు పరవశించిపోయారు. సాయంత్రం గాయత్రీనారాయణ్‌ బృందం సంగీత కచేరి నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని