భర్తీలో వెనుకబాటు.. పాలన నగుబాటు
విద్యుత్తు శాఖ సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి.
ఉమ్మడి జిల్లాలో 41 ఏఈ పోస్టులు ఖాళీ
సెక్షన్ కార్యాలయాలకు ఇన్ఛార్జులుగా డీఈఈలు
అనంతపురంలోని డీ-4 సెక్షన్ కార్యాలయం
అనంతపురం (విద్యుత్తు), న్యూస్టుడే: విద్యుత్తు శాఖ సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 82 సెక్షన్ కార్యాలయాలు ఉండగా 41 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని సెక్షన్ కార్యాలయాలకు జూనియర్ ఇంజినీర్లను ఇన్ఛార్జులు (బాధ్యులు)గా నియమించారు. కొన్నిచోట్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)లకు సెక్షన్ కార్యాలయాలకు బాధ్యులుగా నియమించటంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 12 వేల సర్వీసులను పర్యవేక్షించాల్సిన ఏఈ 35 నుంచి 45 వేల సర్వీసులను పర్యవేక్షిస్తున్నామని ఏఈలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడుంటే.. ఇక్కడుండరు
రెగ్యులర్ ఏఈలు లేని సెక్షన్ కార్యాలయాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇన్ఛార్జులు సక్రమంగా సెక్షన్లకు వెళ్లక ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్ఛార్జులు అక్కడుంటే ఇక్కడ ఉండరు అనే పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో గృహ 14 లక్షలు, వాణిజ్య 1.10 లక్షలు, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు 25 వేలు, మున్సిపల్ కార్యాలయాలు, పాఠశాలలు, తాగునీటి పథకం 35వేలు, భారీ పరిశ్రమలు 600, వ్యవసాయ 3.50 లక్షలు సర్వీసులున్నాయి. వీటికి సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైనా, నూతన సర్వీసులు పొందాలన్నా వినియోగదారులు, రైతులు, ప్రజలు కచ్చితంగా సెక్షన్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది.
పర్యవేక్షణ కష్టం..
- అనంతపురం జీసస్నగర్లో ఉన్న డీ-4, బళ్లారి రోడ్డులో ఉన్న డీ-5 సెక్షన్ కార్యాలయాలకు ఏఈలు లేకపోవటంతో ఇన్ఛార్జులను నియమించారు. డీ-5 సెక్షన్ పర్యవేక్షణ బాధ్యతలను డీ-6 సెక్షన్ ఏఈకి, డీ-4 సెక్షన్ ఏఈ బాధ్యతలను డీఈఈకి అప్పగించారు. మూడు సెక్షన్లను పర్యవేక్షించటంతోపాటు తనకు శాఖాపరంగా ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేసుకుంటూనే డీఈఈ డీ-4 సెక్షన్ను చూస్తున్నారు.
- ముదిగుబ్బ, తలుపుల సెక్షన్ కార్యాలయాలను ప్రస్తుతం జేఈ(గ్రేడ్-2)కు ఇచ్చారు. సదరు సెక్షన్లు రెండు పెద్దవి కావటంతో రెండేళ్ల కిందట వచ్చిన జేఈ వాటిని పర్యవేక్షించలేని పరిస్థితి నెలకొంది. రోజువారీ ఉన్నతాధికారుల ఒత్తిడి ఉండటంతో జేఈ ఆందోళనకు గురవుతున్నారు.
- నార్పల సెక్షన్ కార్యాలయానికి ఇన్ఛార్జిగా అనంతపురం వెస్ట్ సబ్ డివిజన్ డీఈఈని నియమించారు. చిలమత్తూరు సెక్షన్ బాధ్యతలను హిందూపురం రూరల్ సబ్ డివిజన్ డీఈఈకి, అనంతపురం డీ-4 సెక్షన్ బాధ్యతలను అనంతపురంటౌన్-1 సబ్డివిజన్ డీఈఈకి అప్పగించారు
తప్పని పని భారం..
విద్యుత్తుశాఖ డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో జేఈలు పనిచేయాల్సి ఉంటుంది. జేఈలు తమ విధులు నిర్వహిస్తూనే సెక్షన్ కార్యాలయాలను పర్యవేక్షించాలని ఇన్ఛార్జులుగా నియమించారు. కొందరు ఏఈలు రెండు సెక్షన్లను పర్యవేక్షిస్తున్నారు. రోజువారీ అధికారులు నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్లో సెక్షన్ల పురోగతి చెప్పాల్సి ఉంటుందని, అలాగే సమావేశాలకు హాజరవ్వాల్సి ఉందన్నారు.
తెదేపా హయాంలో భర్తీ
తెదేపా ప్రభుత్వ హయాంలో ఎస్పీడీసీఎల్ పరిధిలో 2015, 2017 సంవత్సరాల్లో ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 54 మందిని ఎంపిక చేసి వారికి వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. వైకాపా వచ్చిన తరవాత ఒకసారి కూడా ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో ఏఈ పోస్టులు సాధించేందుకు సంసిద్ధమవుతున్న నిరుద్యోగులు జగన్ సర్కారుపై మండిపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా కుట్రకు పండుటాకుల విలవిల
[ 03-05-2024]
ఎన్నికల్లో లబ్ధి కోసం జగన్ ప్రభుత్వం చేసిన కుట్రకు పింఛనుదారులు బలవుతున్నారు. గురువారం మండుటెండలో బ్యాంకుల వద్ద బారులు తీరారు. బ్యాంకింగ్ సేవలపై అవగాహన లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. -
సహజ వనరు.. అడ్డంగా మేశారు
[ 03-05-2024]
వైకాపాలోని ఇసుకాసురులు బకాసురుడిని మించిపోయారు. ఇసుకను అమాంతం మింగేస్తున్నారు. నదీతీరాలను నామరూపాల్లేకుండా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక అక్రమ రవాణా సాగిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. -
‘జగన్ కుయుక్తులు తిప్పికొట్టండి’
[ 03-05-2024]
జగన్ తిరిగి అధికారంలోకి రావడానికి నానా కుయుక్తులు పన్నుతున్నాడని, ముస్లిం మైనార్టీలు తిప్పికొట్టాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ మహమ్మద్ షరీఫ్, తెదేపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ పిలుపునిచ్చారు. -
ఓపీఓలు ఓటేసేది ఎక్కడ?
[ 03-05-2024]
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ కోసం రికార్డు స్థాయిలో ఫాం-12 దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈనెల ఒకటో తేదీతో ఫాం-12 దరఖాస్తు చేసుకోడానికి తుది గడువు ముగిసింది. -
తెదేపా హయాంలో నీరు.. వైకాపా పాలనలో కన్నీరు
[ 03-05-2024]
ఘన చరిత్ర కలిగిన కణేకల్లు శ్రీచిక్కణ్ణేశ్వర వడియార్ చెరువుకు భద్రత కరవైంది. రైతుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్న జగన్ సర్కారు ఐదేళ్లుగా చెరువు అభివృద్ధి, నిర్వహణకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. -
రూ.2 వేల కోట్ల నగదు పట్టివేత
[ 03-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పామిడి మండలంలోని గజరాంపల్లి గ్రామ 44వ జాతీయరహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా నాలుగు కంటైనర్లు వరుసగా వెళ్లడంతో అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేశారు. -
వలస జీవులు.. వేదన బతుకులు
[ 03-05-2024]
పరిశ్రమలు తీసుకొస్తాం.. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.. స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ చేసిన వాగ్దానాలన్నీ బూటకమేనని తేలిపోయింది. -
చెరువులకు కృష్ణా జలాలు తీసుకువస్తాం
[ 03-05-2024]
కరవు కోరల్లో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు వైకాపా ప్రభుత్వానికి చేతులు రాలేదని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన ఉరవకొండ మండలం కోనాపురం, చిన్నముష్టూరు, లత్తవరం, లత్తవరం తండా, షేక్షానుపల్లి తదితర గ్రామాల్లో రోడ్షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ అధర్మ పాలనను తరిమికొట్టాలి
[ 03-05-2024]
ధర్మ మార్గాన్ని అనుసరించిన బసవేశ్వరుడి స్ఫూర్తితో అధర్మానికి నిలువెత్తు రూపం జగన్ పాలనను తరిమికొట్టి, ధర్మానికి మారుపేరైన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు వీరశైవులంతా సమాయత్తం కావాలని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
నీరివ్వడంలో జగన్ ప్రభుత్వం కాలయాపన
[ 03-05-2024]
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీటీపీ కాలువ పనులు ఆపి ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం కాలయాపన చేసిందని, భూములు కోల్పోయిన కొంత మంది రైతులకు మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. -
రాప్తాడు నుంచే మార్పు మొదలు: సునీత
[ 03-05-2024]
ప్రజలంతా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆ మార్పు రాప్తాడు నియోజకవర్గం నుంచే మొదలైందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
ఎంత పని చేశావమ్మా?
[ 03-05-2024]
మండలంలోని కల్లుదేవనహళ్లి గ్రామంలో ఓ తల్లి బిడ్డకు విషమిచ్చి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
అక్షరాలా మాట తప్పి.. నిస్సిగ్గుగా మడమ తిప్పి
[ 03-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అని ఊదరగొట్టి ప్రజలను మోసం చేసిన జగన్.. నిత్యం ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే రక్షకభటులకు అరచేతిలో స్వర్గం చూపించాడు. -
ఉన్నాయా కళ్లు.. ఏంచేశారు.. ఐదేళ్లు?
[ 03-05-2024]
నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీల ప్రభుత్వమని సీఎం జగన్ గొప్పలు చెబుతారు. అలాంటి ఆర్భాటపు ముఖ్యమంత్రి నోరు మూయించే చిత్రమిది. -
మడకశిరలో తెదేపాదే విజయం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు నామినేషన్ ఉపసంహరించుకున్నామని, మడకశిర అభ్యర్థి ఎంఎస్ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే ఈరన్న తెలిపారు. -
ప్రచార లోపం.. ఓటెక్కడ వేయాలో గందరగోళం
[ 03-05-2024]
జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం కోసం ఫాం-12 దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు ముగిసింది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 16,150 మంది ఉద్యోగులను నియమించారు. -
వంద పడకలన్నారు.. హామీతో సరిపెట్టారు..
[ 03-05-2024]
ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులను మంచాల కొరత వేధిస్తోంది. ఆసుపత్రిలో రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో ఒకదానిపైనే ఇద్దరు, ముగ్గురికి చికిత్సలు అందించాల్సిన దుస్థితి నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్