చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం
తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్చౌదరి, అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్చౌదరి, ఇన్ఛార్జి నాని, నిమ్మలకిష్టప్ప, దగ్గుపాటిప్రసాద్, వెంకటశివుడు యాదవ్
అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్చౌదరి, అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో జోన్-5 ఇన్ఛార్జి నాని, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్. అనంతపురం పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త నిమ్మలకిష్టప్పలతో కలిసి నిర్వహించిన సమావేశంలో ప్రభాకర్చౌదరి మాట్లాడుతూ.. ఉదయం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 11.00-12.00 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొంటారని, సాయంత్రం 6 గంటలకు సప్తగిరి కూడలిలో బహిరంగ సభకు హాజరవుతారని ఆయన వివరించారు. ప్రజాగళం పేరుతో రెండు, మూడు సభలు నిర్వహించడం జరుగుతుందని, జగన్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు.
నాయకుల వాగ్వాదం
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి, అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు శనివారం ఆయా కార్యాలయాల్లో ఘర్షణ పడ్డారు. ఉదయం దగ్గుపాటి ప్రసాద్.. ప్రభాకర్చౌదరి నివాసానికి వచ్చారు. తెలుగు యువత నాయకుడొకరు బూత్ స్థాయి ఏజెంట్లను ఇష్టానుసారంగా మార్చారన్న కారణంతో ఇరువురి కార్యకర్తలు, నాయకుల మధ్య గొడవ మొదలైంది. తోపులాట చోటుచేసుకుంది. చివరకు కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. కార్యాలయానికి రావాలనే పిలుపుతో ప్రభాకర్చౌదరి మధ్యాహ్నం దగ్గుపాటి కార్యాలయానికి వెళ్లారు. మళ్లీ అక్కడ ఇరువర్గాల కార్యకర్తలు, నాయకులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వచ్చి నాయకులను, కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతా.. నిశబ్దం
[ 18-05-2024]
ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రంలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన తాడిపత్రిలో నిశబ్ద వాతావరణం నెలకొంది. తాడిపత్రి పట్టణ వాసులకు వైకాపా మూకల అరాచక పర్వాన్ని గుర్తు చేసుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతోంది. -
ఉత్తర మండలాల్లో మోస్తరు వర్షం
[ 18-05-2024]
జిల్లాలోని ఉత్తర మండలాల్లో గురువారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. డి.హీరేహాళ్ మండలంలో 28.8 మి.మీలు అత్యధికంగా వర్షం కురిసింది. -
ఇసుకాసురుల ఆగడాలు ఆగేనా?
[ 18-05-2024]
ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. నిబంధనలను లెక్కచేయకుండా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. అధికారం వారి చేతుల్లో ఉండటంతో అధికారులు సైతం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. -
ఓటర్ల ఓపికకు పరీక్ష
[ 18-05-2024]
సగటున ఒక నిమిషంలోపే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది. -
విద్యుత్తు నియంత్రికల మంజూరులో కీలక అధికారి తీరే వేరప్పా..
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లా విద్యుత్తుశాఖలో ఓ కీలక అధికారి అధికార పార్టీ తొత్తుగా మారిపోయారు. వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తే చాలు.. వెంటనే విద్యుత్తు నియంత్రికలు మంజూరు చేసి తన విధేయతను చాటుకుంటున్నారు.రెండేళ్లలో 300 పైగా 25కేవీ సామర్థ్యంగల నియంత్రికలు మంజూరు చేశారంటే ఆయన వైకాపా నేతలతో ఎంత అంటకాగారో అర్థం చేసుకోవచ్చు. -
బీఎల్ఓలకు రిక్తహస్తం!
[ 18-05-2024]
బూత్ స్థాయి అధికారులపై(బీఎల్ఓ) ఎన్నికల అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. పని చేయించుకుని పైసా పారితోషకం ఇవ్వడం లేదు. ఓటరు జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఇంటింటా సర్వే.. ఇలా అనేక కీలక పనులు చేస్తున్న బీఎల్ఓల పట్ల కనికరం చూపడం లేదు. -
అవసరమైతేనే సిజేరియన్ చేయండి
[ 18-05-2024]
పలు ఆసుపత్రుల్లో గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారని, అవసరమైతే తప్ప చేయకూడదని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.బి.దేవి తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సిజేరియన్ ద్వారా ఎక్కువ ఆపరేషన్లు చేసిన డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. -
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
[ 18-05-2024]
‘శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసిన రామకృష్ణారెడ్డి.. అధికారిక వాహనాలను (కార్లు) సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు విహారయాత్రలకు రెక్టార్, రిజిస్ట్రార్లకు కేటాయించిన కార్లను వాడుకున్నారు. -
‘తాడిపత్రిలో అల్లర్లకు ఆజ్యం పోసింది వైకాపా ఎమ్మెల్యేలే’
[ 18-05-2024]
తాడిపత్రి పట్టణంలో జరిగిన దాడులకు తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ముఖ్య కారణమని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ ఆరోపించారు. -
తాగునీటి సరఫరా అధ్వానం.. ఎటు చూసినా అపరిశుభ్రం
[ 18-05-2024]
ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంతోపాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
[ 18-05-2024]
ముదిగుబ్బ మండలంలోని గుంజేపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు రాజు (27) ముదిగుబ్బకు ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే వాడు. అతనికి ఐదేళ్ల కిందట వివాహమైంది. -
రేషన్ పంపిణీకి నేడు ఆఖరు
[ 18-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీపై ఎన్నికల ప్రభావం పడింది. ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారం తదితర కారాణాల వల్ల కార్డుదారులకు సరకులు అందలేదు. -
చెన్నకేశవుడి రాజసం
[ 18-05-2024]
పట్టణంలో జరుగుతున్న లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సర్వ భూపాల వాహనం, రాత్రి సింహ వాహనంపై స్వామి వారు పురవీధుల్లో విహరించారు. -
భక్తుల కష్టాలు ఖాద్రీశుడికే ఎరుక!
[ 18-05-2024]
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు. -
ఇదేంది సారూ.. పారితోషికంలో తేడాలా?
[ 18-05-2024]
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా ఉపాధ్యాయులకే ఉందని, వారిని తప్పించి, ఇతరులతో ఈ ప్రక్రియను నిర్వహిస్తే అస్తవ్యస్తమవుతుందని, వారు మాత్రమే కచ్చితంగా నిర్వహించగలరని ఎన్నికల సంఘం కితాబు ఇచ్చింది.