సమన్వయంతో వైద్యసేవలు
జిల్లాలో అత్యధిక కరోనా కేసులు తిరుపతి నగరంలో నమోదవుతున్నాయి. జిల్లాతో పాటు ఇతర జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందించే రుయా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది 120 మంది కరోనాతో బాధపడుతున్నారు. సిబ్బంది కొరతతో బాధితులకు వైద్యసేవలు అందించడం ఆసుపత్రికి భారంగా
‘ఈటీవీ-ఈనాడు’తో రుయా సూపరింటెండెంట్ భారతి
ఈటీవీ-తిరుపతి: జిల్లాలో అత్యధిక కరోనా కేసులు తిరుపతి నగరంలో నమోదవుతున్నాయి. జిల్లాతో పాటు ఇతర జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందించే రుయా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది 120 మంది కరోనాతో బాధపడుతున్నారు. సిబ్బంది కొరతతో బాధితులకు వైద్యసేవలు అందించడం ఆసుపత్రికి భారంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అంతరాయం లేకుండా వైద్యసేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర విషయాలను రుయా ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ భారతి ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో వెల్లడించారు.
ఈటీవీ: జిల్లాలో కీలకమైన రుయా ఆస్పత్రిలో కరోనా వైద్యసేవలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
భారతి: కరోనా రెండో దశ తగ్గడంతో గతంలో ట్రయేజ్, కొవిడ్ పరీక్షల కేంద్రాన్ని పాత ప్రసూతి ఆసుపత్రి నుంచి రుయా ఆసుపత్రి ఆవరణలోకి తరలించాం. సంక్రాంతి తర్వాత పరీక్షల కోసం అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో నమూనాల సేకరణ, పరీక్షల కేంద్రం, ట్రయేజ్ కేంద్రాన్ని మళ్లీ పాత ప్రసూతి ఆసుపత్రికి మార్చాం.
తిరుపతి నగరంలో ఉద్ధృతికి కారణాలేమంటారు?
3 ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి సందర్శించే వారి సంఖ్య పెరిగింది. రెండో దశ తర్వాత ప్రజల్లో ఉన్న భయం తగ్గి అశ్రద్ధ అధికమైంది. మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది.
గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ పడకల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలేమిటి?
ఆక్సిజన్ పడకలు 690, ఐసీయూ పడకలు 135 ఉన్నాయి. ఐసీయూ పడకల్లో 102 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ అవసరమైన బాధితులు 10 నుంచి 12 మంది వరకు ఉన్నారు. వీరి సంఖ్య పెరిగినా సరిపడా అందజేసేందుకు వీలుగా నాలుగు ఆక్సిజన్ ట్యాంకులు, నాలుగు పీఏఎస్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు బయో మెడికల్ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.
వైద్యులు, సిబ్బంది కొవిడ్ బారిన పడుతున్నారు. వైద్యసేవలపై ప్రభావం పడదంటారా?
రుయాలో వైద్యులు, వైద్యసిబ్బంది, భద్రత సిబ్బంది 120 మంది కరోనా బారినపడటంతో ఎంపిక చేసి శస్త్రచికిత్సలు చేసే విధానానికి విరామం ఇచ్చాం. అందుబాటులో ఉన్న వారిని సమన్వయం చేసుకుంటూ విడతల వారీగా విధులు కేటాయిస్తున్నాం. కరోనా లక్షణాలు తక్కువ ఉన్నవారు ఏడు రోజుల తర్వాత విధులకు హాజరు కావాలని సూచించాం.
మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయి?
ప్రస్తుతానికి ఏవీ లేవు. ఎన్ ఆర్ బి మాస్కుల మీద ఏడుగురు ఉన్నారు. మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడుతూ కరోనా బారిన పడిన వారిని ఆసుపత్రిలో చేర్చుకుంటున్నాం. లక్షణాలు తక్కువ ఉన్న వారిని హోం ఐసోలైషన్కు సూచిస్తున్నాం. ఇంట్లో వసతి లేని వారిని విష్ణునివాసానికి పంపుతున్నాం.
పూర్తి స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి?
సంక్రాంతి తర్వాత కరోనా పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తొలుత సాధారణ ఓపీలో పరీక్షలు చేసిన తర్వాత రోగి లక్షణాలు, ఆరోగ్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వైద్యులు కరోనా పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. ఓపీ టికెట్లో స్టాంప్ వేసి కరోనా పరీక్షలకు వెళ్లాలని సూచిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM