logo

వారే ఒక సైన్యం

తమిళనాడు రాష్ట్రం బరుగూరు పరిసర ప్రాంతం నుంచి మోట్లచేను మీదుగా కర్ణాటక రాష్ట్రానికి వెళుతున్న తమిళ బియ్యం వాహనాన్ని ఆదివారం సాయంత్రం గ్రామస్థులు అడ్డుకున్నారు. రోజూ తమిళ బియ్యం కర్ణాటకకు తరలిస్తున్న వాహనాలు గ్రామంలో అతివేగంగా వెళ్తుండ

Published : 23 May 2022 05:53 IST

బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న గ్రామస్థులు


కూసూరు వద్ద గ్రామస్థులు నిలిపివేసిన వాహనం ఇదే

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: తమిళనాడు రాష్ట్రం బరుగూరు పరిసర ప్రాంతం నుంచి మోట్లచేను మీదుగా కర్ణాటక రాష్ట్రానికి వెళుతున్న తమిళ బియ్యం వాహనాన్ని ఆదివారం సాయంత్రం గ్రామస్థులు అడ్డుకున్నారు. రోజూ తమిళ బియ్యం కర్ణాటకకు తరలిస్తున్న వాహనాలు గ్రామంలో అతివేగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు గుర్తించారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని పోలీసు యంత్రాంగానికి తెలియజేశారు. స్పందించిన కుప్పం పోలీసులు ఆదివారం రాత్రి కూసూరు గ్రామానికి చేరుకుని బియ్యం తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని