అంతా రహస్యమే..!
ప్రతినెలా విధిగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలి.. జమాఖర్చులు తెలియజేయాలి.. అజెండాలోని అంశాలను ఉన్నతాధికారులకు పంపాలి.. అందరికీ తెలిసేలా నోటీసు బోర్డులోనూ కనబరచాలి.
వెలుగులోకి రాని అజెండా అంశాలు
తూతూమంత్రంగా పురపాలిక సమావేశాలు
సూళ్లూరుపేటలో పుర కౌన్సిల్ సమావేశం
సూళ్లూరుపేట, న్యూస్టుడే: ప్రతినెలా విధిగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలి.. జమాఖర్చులు తెలియజేయాలి.. అజెండాలోని అంశాలను ఉన్నతాధికారులకు పంపాలి.. అందరికీ తెలిసేలా నోటీసు బోర్డులోనూ కనబరచాలి. ఇందుకు భిన్నంగా పలు పురపాలికల్లో అంతా రహస్యంగా ఉంచేస్తున్నారు.
కౌన్సిల్ సమావేశాల్లో ఆర్థిక అంశాలతోపాటు, అభివృద్ధి పనుల గురించి చర్చించాలి. జమాఖర్చులు, అభివృద్ధి అంశాల గురించి పూర్తిస్థాయిలో సమావేశంలో తెలియజేసి, ఆమోదం పొందాలి. దీనినే సమావేశ అజెండాగా పిలుస్తుంటారు. ఇందులో ఉండే అంశాలను ఒక్కొక్కటిగా చదివి వినిపించిన తర్వాత కౌన్సిలర్ల ఆమోదం పొందాలి. ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని పురపాలక ఛైర్మన్ మినిట్స్ బుక్లో నమోదు చేస్తూ.. ప్రతిదాని కింద వెంటనే సంతకాలు చేయాలి. కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత అదేరోజు సాయంత్రం అజెండాలోని అంశాలతోపాటు, కౌన్సిల్ తీర్మానం చేసిన వాటిని తెలియజేస్తూ.. సంబంధిత నకలును గుంటూరులోని పురపాలక కమిషనర్ (సీడీఎంఏ), కలెక్టర్, ఆర్డీవో/సబ్కలెక్టర్కు పంపాలి. సంబంధిత కార్యాలయ నోటీసు బోర్డులో కనబరచాలి.
నిధులు పక్కదారి ఇలా..
పురపాలిక కౌన్సిల్ సమావేశాల్లో జమాఖర్చుల గురించి చర్చించకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి. పలువురు ఉద్యోగులు వాటిని తమ సొంత జేబుల్లో వేసుకున్న దాఖలాలు లేకపోలేదు. గతంలో గూడూరు పురపాలక సంఘంలో రూ.18 లక్షలు ఎలాంటి బిల్లులు లేకుండా పక్కదారి పట్టింది. ఆ తర్వాత నిధులను ఉద్యోగులే దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. సూళ్లూరుపేట పురపాలికలో రూ.32.50 లక్షలు ఇతరులు తమ సొంత అవసరాలకు వినియోగించుకున్నారు. సంబంధిత కార్యాలయంలోని ఓ ఉద్యోగి జమాఖర్చులు పరిశీలిస్తుండగా నిధులకు లెక్కలే లేవు. సిబ్బందే జేబులో వేసుకున్నట్లు తెలిసింది. విషయం సీడీఎంఏకు తెలియడంతో వారి విచారణ చేపట్టారు.
ఉన్నతాధికారులకు తెలియజేయాలి
కౌన్సిల్ సమావేశాల్లో చర్చించిన, ఆమోదించిన అంశాలను ఉన్నతాధికారులకు తెలియాజేయాలి. జమాఖర్చులు వెల్లడించాలి.అజెండా ప్రతులను ఉన్నతాధికారులకు పంపేలా చర్యలు తీసుకుంటాం.
మూర్తి, ఆర్డీ, అనంతపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.