గడువు లేక.. దరఖాస్తు వీలుకాక
చేదోడు పథకం అర్హులందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. దరఖాస్తుకు మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు చాలినంత సమయం లేకపోవడంతో పలువురు కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోలేక పోయారు.
ఈ దఫా అందరికీ అందని చేదోడు
చిత్తూరు (జిల్లా పంచాయతీ), తిరుపతి (కలెక్టరేట్) న్యూస్టుడే: చేదోడు పథకం అర్హులందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. దరఖాస్తుకు మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు చాలినంత సమయం లేకపోవడంతో పలువురు కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోలేక పోయారు. ఈ మేరకు వారు ఆందోళన చెందుతున్నారు. అవసరమైన పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నా సకాలంలో అందక పోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని, మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.
సమయం లేక..
పథకం కింద దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ప్రభుత్వం ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో రెండో విడత సాయం అందించగా, ఈనెల 30వ తేదీ మూడో విడతగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా అర్హత సాధించిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినా, సమయం లేకపోవడంతో పథకానికి దూరమయ్యారు. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా ఉద్దేశ పూర్వకంగానే మూడు రోజులు మాత్రమే గడువిచ్చారని ఆరోపిస్తున్నారు. పాత లబ్ధిదారుల నుంచి వేలి ముద్రల సేకరణ కూడా ఇదే సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు రోజుల్లోనే పలు రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ప్రకటించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, పాత వారు సైతం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. చివరి రోజైన 26న గణతంత్ర దినోత్సవం కావడంతో సచివాలయాలు, తహసీల్దారు కార్యాలయాలు పనిచేయలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొరాయించిన సర్వర్..
లబ్ధిదారులు కార్మిక ధ్రువీకరణ పత్రాన్ని (లేబర్ సర్టిఫికెట్) తాజాగా తీసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఈపత్రాన్ని రెండు గంటల్లోనే జారీ చేస్తున్నారు. కుల ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పాసుపుస్తకం, రేషన్, ఆధార్ కార్డులు, ఫొటోను ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల్లోనే ఈనెల 26వ తేదీ సాయంత్రం లోపు అప్లోడ్ చేసి అనుసంధానం చేయాలి. అయితే సర్వర్ మోరాయించడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు గడువు పొడిగించారు. సచివాలయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీకి ఏపీ సేవ పోర్టల్ వినియోగిస్తారు. అక్కడే తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేస్తారు. శుక్రవారం ఉదయం నుంచే పోర్టల్ సర్వర్ మొరాయించింది. దీంతో చేదోడు దరఖాస్తుదారులకు కార్యాలయాల వద్దనే సాయంత్రం వరకూ పడిగాపులు తప్పలేదు. ఈ పరిస్థితుల్లో పత్రాలు సమర్పించేందుకు గడువు పెంచాలని కోరుతున్నారు.
మరో అవకాశం ఉంటుంది..
సుబ్రహ్మణ్యం, ఈడీ, బీసీ కార్పొరేషన్
ఇబ్బంది పడిన వారికి మరో అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. ఈనెల 30న మూడో విడత పంపిణీ అనంతరం మరో సారి నమోదుకు అవకాశం కల్పిస్తారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.