గడువు లేక.. దరఖాస్తు వీలుకాక
చేదోడు పథకం అర్హులందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. దరఖాస్తుకు మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు చాలినంత సమయం లేకపోవడంతో పలువురు కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోలేక పోయారు.
ఈ దఫా అందరికీ అందని చేదోడు
చిత్తూరు (జిల్లా పంచాయతీ), తిరుపతి (కలెక్టరేట్) న్యూస్టుడే: చేదోడు పథకం అర్హులందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. దరఖాస్తుకు మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు చాలినంత సమయం లేకపోవడంతో పలువురు కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోలేక పోయారు. ఈ మేరకు వారు ఆందోళన చెందుతున్నారు. అవసరమైన పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నా సకాలంలో అందక పోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని, మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.
సమయం లేక..
పథకం కింద దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ప్రభుత్వం ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో రెండో విడత సాయం అందించగా, ఈనెల 30వ తేదీ మూడో విడతగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా అర్హత సాధించిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినా, సమయం లేకపోవడంతో పథకానికి దూరమయ్యారు. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా ఉద్దేశ పూర్వకంగానే మూడు రోజులు మాత్రమే గడువిచ్చారని ఆరోపిస్తున్నారు. పాత లబ్ధిదారుల నుంచి వేలి ముద్రల సేకరణ కూడా ఇదే సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు రోజుల్లోనే పలు రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ప్రకటించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, పాత వారు సైతం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. చివరి రోజైన 26న గణతంత్ర దినోత్సవం కావడంతో సచివాలయాలు, తహసీల్దారు కార్యాలయాలు పనిచేయలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొరాయించిన సర్వర్..
లబ్ధిదారులు కార్మిక ధ్రువీకరణ పత్రాన్ని (లేబర్ సర్టిఫికెట్) తాజాగా తీసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఈపత్రాన్ని రెండు గంటల్లోనే జారీ చేస్తున్నారు. కుల ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పాసుపుస్తకం, రేషన్, ఆధార్ కార్డులు, ఫొటోను ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల్లోనే ఈనెల 26వ తేదీ సాయంత్రం లోపు అప్లోడ్ చేసి అనుసంధానం చేయాలి. అయితే సర్వర్ మోరాయించడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు గడువు పొడిగించారు. సచివాలయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీకి ఏపీ సేవ పోర్టల్ వినియోగిస్తారు. అక్కడే తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేస్తారు. శుక్రవారం ఉదయం నుంచే పోర్టల్ సర్వర్ మొరాయించింది. దీంతో చేదోడు దరఖాస్తుదారులకు కార్యాలయాల వద్దనే సాయంత్రం వరకూ పడిగాపులు తప్పలేదు. ఈ పరిస్థితుల్లో పత్రాలు సమర్పించేందుకు గడువు పెంచాలని కోరుతున్నారు.
మరో అవకాశం ఉంటుంది..
సుబ్రహ్మణ్యం, ఈడీ, బీసీ కార్పొరేషన్
ఇబ్బంది పడిన వారికి మరో అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. ఈనెల 30న మూడో విడత పంపిణీ అనంతరం మరో సారి నమోదుకు అవకాశం కల్పిస్తారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు
[ 05-05-2024]
సూపర్ సిక్స్, మోదీ హమీలు చూసి జగన్కు నిద్రపట్టడం లేదని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుందన్న కోపంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. -
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్ పలమనేరు వస్తున్నారని వైకాపా నేతలు సంబరపడ్డారు. స్థానిక సమస్యలు లేవనెత్తి ప్రజల మనసులు చూరగొంటారని ఆశపడ్డారు. రానున్న వారం రోజుల ప్రచారంలో వీటినే అస్త్రాలుగా మలుచుకుని ప్రజలకు వివరించాలనుకున్నా వారి ఆశలపై సీఎం నీళ్లు చల్లారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
[ 05-05-2024]
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
జగన్మోసం.. ప్రశ్నించలేని వారిపై ప్రతాపం
[ 05-05-2024]
అభాగ్యులు, అవ్వాతాతలకు జరుగుతోన్న జగన్మోసం అంతాఇంతా కాదు.. ఓట్ల రాజకీయం కోసం ముఖ్యమంత్రి జగన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులతో చెలగాటమాడుతున్నారు.. ఒకటో తేదీన ఇంటి వద్ద ఇచ్చే పింఛను రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకులంటూ మండే ఎండల్లో అమాయకులను ముప్పతిప్పలు పెడుతున్నారు. -
నేడు, రేపు పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 05-05-2024]
ఎన్నికల సిబ్బంది తమ పోస్టల్ బ్యాలెట్ను ఆది, సోమవారాల్లో వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ కోరారు. పలు శాఖల అధికారులకు శనివారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ‘5న పీవో, ఏపీవో, ఓపీవో, ఎంవోలు, అంగన్వాడీలు, 6న అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారు.. -
గడిచాయి ఐదేళ్లు.. ఏవీ నీళ్లు?
[ 05-05-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి’ అన్నది సామెత. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపాలో నంబరు-2 అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్రెడ్డిది మన జిల్లానే కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని ప్రజలు భావించారు. -
జరుగు జరుగు.. జాబుల్లేవ్ జగన్
[ 05-05-2024]
ఏటా ప్రారంభంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా.. మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తా.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంతమొందించడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సమయాన నిర్వహించిన పాదయాత్రలో గొప్పగొప్ప హామీలు గుప్పించారు.. -
ఇదేంది జగన్.. ఇలా తిప్పుతున్నావ్..!
[ 05-05-2024]
పూతలపట్టు మండలం కొత్తకోటకు చెందిన ఓ వృద్ధుడికి బ్యాంకు ఖాతా ఉంది. ఆయనకు వచ్చే పింఛను బ్యాంకులో జమ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆయన రెండ్రోజులుగా బ్యాంకు వెళ్లినా ఇంకా జమ కాలేదనే సమాధానం వస్తోంది. -
అండగా ఉంటాం.. ఆదరించండి
[ 05-05-2024]
ప్రజలకు అండగా ఉంటాం.. ఆదరించండని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, ఆయన సతీమణి ప్రతిమ, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, సాయికృష్ణారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని చర్చివీధి, మార్కెట్ చౌక్, 3, 7వ డివిజన్లతో పాటు, శంకరయ్యగుంటలో వారు విడివిడిగా ప్రచారం చేశారు. -
‘కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నా’
[ 05-05-2024]
కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నట్లు బీఎన్ కండ్రిగ మండలం చిన్నపాలవేడు గ్రామానికి చెందిన విశ్రాంత ఎస్పీ రమేషయ్య తెలిపారు. శనివారం ఆయన కూటమి తెదేపా అభ్యర్థి కోనేటి ఆదిమూలం సమక్షంలో తెదేపాలో చేరారు. -
పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది కోసం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్వోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్కు వైకాపా నేతల ప్రలోభాలు
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నేతలు ప్రలోభాలకు తెరతీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. -
శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మందికి అస్వస్థత
[ 05-05-2024]
శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గంగవరం మండలం నలసానపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ఇంట్లో శుభకార్యానికి బంధువులు, స్నేహితులు వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్