జలభద్రం
ఎండలు మండిపోతున్నాయి.. భూగర్భజలాల మట్టం తగ్గి నగరంలో పలుచోట్ల బోర్లలో నీటి మట్టం పడిపోతోంది.
నీటి పొదుపు, సంరక్షణ తప్పనిసరి
దర్గా కూడలిలో నగరపాలక నీటి శుద్ధీకరణ కేంద్రం వద్ద నిర్మించిన ఇంకుడుగుంత(పాత చిత్రం)
న్యూస్టుడే, చిత్తూరు నగరం: ఎండలు మండిపోతున్నాయి.. భూగర్భజలాల మట్టం తగ్గి నగరంలో పలుచోట్ల బోర్లలో నీటి మట్టం పడిపోతోంది.. శాశ్వత నీటి పథకాలు లేని జిల్లా కేంద్రానికి ఎన్టీఆర్ జలాశయమే దిక్కు.. వరదలతో నిండే ఈ జలాశయం నుంచి ఆర్నెల్లకు వరకు నగరానికి నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి.. ఇక ఈ ప్రాజెక్టులో నీరు ఖాళీ అయితే బిందెడు నీటికి నగర ప్రజలు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి మొదలవుతుంది.
ప్రతి ఇంట్లోనూ ఇంకుడుగుంత..
నివాస ప్రాంగణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని అందరూ మరిచారు. పాత కాలంలో ఉపయోగించే ఈ పద్ధతిలో భూమిలో నీరు ఎల్లప్పుడూ ఉండేది. నగరంలో 40వేలకు పైగా నివాసాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఒక ఇంకుడుగుంత నిర్మిస్తే భవిష్యత్తులో నీటి సమస్య ఏర్పడదు. అతి తక్కువ ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు రూ.7వేల నుంచి రూ.8వేలు వెచ్చించాలి. తొలుత ఇంట్లో బోరు పక్కన మూడు అడుగుల గుంత తీయాలి. ఈ గుంతలో పట్టేలా సిమెంటుతో రింగులుగా తయారు చేసుకోవాలి. వాటిని ఈ గుంతలో దించాలి. రింగు రింగుకు మధ్య కాంక్రీటు, సిమెంటు మాత్రమే వినియోగించాలి. అనంతరం అలాగే విడిచిపెట్టి దీనిపై ఒక కప్పు పెట్టుకోవాలి. ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని ప్రత్యేక పైపు ద్వారా ఈ గుంతలోకి మళ్లించేలా ఏర్పాటు చేసుకోవాలి.
శుద్ధీకరణ కేంద్రాల వద్ద..
నగరంలో వివిధ ప్రాంతాల్లో నగరపాలక, ప్రైవేటు శుద్ధీకరణ కేంద్రాలు(మినరల్ వాటర్ ప్లాంట్) వెలిశాయి. వీటి నుంచి నిత్యం లక్షల లీటర్ల నీరు వృథాగా మురుగునీటి కాలువల్లో విడిచిపెడుతు న్నారు. ప్రతి కేంద్రం వద్ద ఇంకుడుగుంతలు నిర్మిస్తే ఆ నీరు భవిష్యత్తులో ఉపయోగించుకునే వీలుం టుంది. ఆయా కేంద్రాల నిర్వాహకులు ఆలోచించి వృథానీరు వెళ్లే స్థలంలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకుంటే భావితరాలకు నీరు అందించిన వారమవుతాం.
లీకేజీలు గుర్తించి సమాచారం..
నగరంలో 80 కిమీ వరకు పైప్లైన్ల ద్వారా నివాసాలు, పబ్లిక్ కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పాత పైప్లైన్లు విరిగి, తుప్పుపట్టి వాల్వ్ల వద్ద నీరు లీకవుతోంది. గంటల తరబడి ఇలా నీరు వృథాగా రోడ్లపై పోతోంది. దీన్ని స్థానికులు తమ కాలనీల్లో గుర్తించి నగరపాలక అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
అవగాహన ముఖ్యం..
ఇళ్లల్లో నీటి వినియోగంపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి. తొలుత మార్పు మన నుంచే మొదలైతే సమాజంలోనూ నీటి పొదుపుపై అవగాహన వస్తుంది. నీటి వనరులు ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి.
వెంకట ప్రసాద్, డీఈఈ, నగరపాలక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.