చిన్నవాటిలో చేతివాటం.. పెద్దవాటిలో రాజకీయజోక్యం
పట్టణాల్లో ట్రేడ్ లైసెన్సుల మాయాజాలం జరుగుతోంది. ఏటికేడు దుకాణాలు పెరుగుతున్నా వసూళ్లలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కొన్నిచోట్ల నిర్ణీత ధరల కంటే తక్కువగా వసూలు చేస్తున్నారు.
ట్రేడ్ లైసెన్సు ఫీజుల్లో మాయాజాలం
పెరిగిపోయిన అనధికారిక వసూళ్లు
గూడూరు, న్యూస్టుడే: పట్టణాల్లో ట్రేడ్ లైసెన్సుల మాయాజాలం జరుగుతోంది. ఏటికేడు దుకాణాలు పెరుగుతున్నా వసూళ్లలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కొన్నిచోట్ల నిర్ణీత ధరల కంటే తక్కువగా వసూలు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల చిన్నాచితకా దుకాణాలతో బేరాలు సాగిస్తుండగా పెద్దఎత్తున వసూలు చేయాల్సిచోట రాజకీయ జోక్యం పెరుగుతోంది. దీంతో పురపాలక ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది.ఉమ్మడి జిల్లాలో ఏటా రూ.2.25 కోట్ల మేర ట్రేడ్ లైసెన్స్ వసూలవుతోంది. చిత్తూరు నగరంలో బార్, రెస్టారెంట్స్ వంటి వాటి నుంచి ఏటా రూ.17,300 వసూలు చేయాల్సి ఉంది. ఫ్రూట్ జ్యూస్ తయారీ పరిశ్రమల నుంచి రూ.7 వేలు, లాడ్జీలకు రూ.4 వేలు లెక్కన ఆయా కేటగిరీలవారిగా పురపాలక సంఘాలు ధరలు నిర్ణయించి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈక్రమంలో ఎక్కడికక్కడ చేతివాటం ప్రదర్శిస్తుండటంలో ఆదాయానికి గండిపడుతోంది. కొన్ని దుకాణాలు లెక్కలోకి తీసుకోకుండా ఆప్రాంత అధికారులు కొందరు పంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిఘా, పారదర్శక వ్యవస్థ లేకపోవడంతో ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో ముందస్తు ఏడాది లెక్కలేసి అంతకు 1-5 శాతం పెంచి సర్దుబాటు చేస్తున్నారు. ఈతంతు నగర సంస్థలతోపాటు పురపాలికల్లో ఎక్కువగా నడుస్తోంది.
* ఆహార పదార్థాల తయారీ సంస్థలు, ఫైనాన్స్, ఫైర్వర్క్స్, మెడికల్, బ్యాంకులు, టీ, టైల్స్ దుకాణాలు, ఎగ్జిబిషన్లు, పండ్ల దుకాణాలు, లాడ్జీలు తదితర వాటి నుంచి లైసెన్సు ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. ఏటా దుకాణదారులే ముందకువచ్చి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది. తిరుపతి నగరంలో ఆసుపత్రులు వంటి వాటి నుంచి రూ.6 వేల వరకు వసూలు చేయాల్సి ఉంది. ఇక్కడ పెద్దఎత్తున దుకాణాలున్నా ఫీజులు నామమాత్రంగానే ఉంటున్నాయి. చిత్తూరు నగరంలో నాలుగేళ్లలో దుకాణాల సంఖ్య విస్తరించినా ఆమేరకు ఫీజులు వసూలు చేయడంలేదు. పాలకవర్గాలు కొలువుదీరినా పట్టింపు లేదు. గూడూరు పట్టణంలో దుకాణాల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ ఏటా రూ.14 లక్షలకు మించడంలేదు. ఇక్కడ ఆక్వా ఫీడ్ దుకాణాలు, ఐస్ ఫ్యాక్టరీలు వంటివిఉన్నా వాటి జోలికి వెళ్లడంలేదు. ఇక్కడ పనిచేస్తున్న కొం దరు తాత్కాలిక ఉద్యోగులు కొన్ని దుకాణాల నుంచి వసూలు చేస్తున్న ఫీజులకు రసీదులు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
పారదర్శకంగా వసూలయ్యేలా చర్యలు
పట్టణ స్థానిక సంస్థల్లో కొత్తగా వెలసిన దుకాణాలపై సర్వే చేయించి ఫీజులు వసూలు చేస్తున్నాం. మరింత లోతుగా గణన పూర్తిచేసి అందరి నుంచి వసూలయ్యే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దుకాణదారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి రసీదులు తీసుకోవడం ఉత్తమం. - మూర్తి, ఆర్డీ, పురలపాలక శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం