logo

మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి నూతన డైరెక్టర్‌

ఎస్వీయూలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి నూతన డైరెక్టర్‌గా ఫిజిక్స్‌ విభాగం సీనియర్‌ ఆచార్యులు పి.విజయలక్ష్మి నియమితులయ్యారు.

Published : 31 Mar 2023 02:32 IST

ఆచార్య విజయలక్ష్మికి ఉత్తర్వులిస్తున్న వీసీ ఆచార్య రాజారెడ్డి

తిరుపతి(ఎస్వీయూ), న్యూస్‌టుడే: ఎస్వీయూలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి నూతన డైరెక్టర్‌గా ఫిజిక్స్‌ విభాగం సీనియర్‌ ఆచార్యులు పి.విజయలక్ష్మి నియమితులయ్యారు. గురువారం వీసీ ఆచార్య రాజారెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు.మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి రావాల్సిన రూ.40 లక్షలు యూజీసీ విడుదల చేసిందని వీసీ పేర్కొన్నారు. నిధుల మంజూరు దస్త్రాన్ని డైరెక్టర్‌కు అందజేశారు. నిధులు తీసుకురావడంలో కృషిచేసిన ప్రస్తుత డైరెక్టర్‌ కోదండరామిరెడ్డిని వీసీ అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య మహమ్మద్‌ హుస్సేన్‌, డాక్టర్‌ ప్రయాగ, డాక్టర్‌ నాగరాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని