చేనేత.. చేయూత
తరతరాలుగా శ్రీకాళహస్తిలో చేనేత వృత్తి ద్వారా ఉపాధిని పొందుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ వృత్తిని నమ్ముకున్న కార్మికులకు ఉపాధి కల్పిస్తూ,
సాంకేతికతతో వ్యాపార విస్తరణ
న్యూస్టుడే, శ్రీకాళహస్తి : తరతరాలుగా శ్రీకాళహస్తిలో చేనేత వృత్తి ద్వారా ఉపాధిని పొందుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ వృత్తిని నమ్ముకున్న కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, మరో వైపు వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాళహస్తిలోని పద్మశాలిపేట, గజేంద్రనగర్, భాస్కరపేట, కొత్తపేట, బహుదూరుపేట తదితర ప్రాంతాల్లో సుమారు 1500 కుటుంబాలకు పైగా ఈ వృత్తి ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నారు.కరోనాకు ముందు చేనేత వస్త్రోత్పత్తులను దుకాణాల్లో ఉంచి విక్రయించుకోవాల్సి వచ్చేది. మూడేళ్ల కిందట చేనేత రంగం కాస్తంత కుదేలైనా మళ్లీ పుంజుకుంది. ప్రధానంగా ఆన్లైన్ మార్కెటింగ్ వైపు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. పలువురు మహిళలు ఆన్లైన్ వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం పెరగాలి
చేనేతల పరంగా ప్రభుత్వ ప్రోత్సాహం మరింతగా పెరగాలి. ఈ వృత్తి ద్వారా ఎంతో మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అందులోనూ ఎక్కువ మంది పేదలే. వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం అవసరం.
భారతి, పద్మశాలిపేట
8ఆన్లైన్ మార్కెటింగ్తో..
వస్త్ర ప్రపంచంలో ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో విధంగా ఉంటుంది. వాళ్లకు నచ్చిన రీతిలో తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆన్లైన్ మార్కెటింగ్కు అలవాటు పడుతున్నారు. కరోనా ముందుతో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాల వ్యాపారం పుంజుకుంది. దుకాణానికి వచ్చి కొనుగోలు చేసే వాళ్లతో పాటు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.
రుక్మిణి, పద్మశాలిపేట
8భయం పోయింది
కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం విలవిలలాడింది. ఆ పరిస్థితుల్లో ఆదరణ పూర్తిగా తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగుతుందని భయం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సాంకేతికత విస్తరిస్తుండటంవల్ల మళ్లీ వ్యాపారం పుంజుకుంటోంది.
సుమతి, భాస్కరపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.