ఎండ కాసినా.. గాలి వీచినా పల్లెల్లో విద్యుత్తు కోత
ఎండలు అధికంగా కాసినా.. గాలులు బలంగా వీచినా.. పల్లెల్లో అంధకారం అలుముకుంటోంది. అప్రకటిత విద్యుత్తు కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అల్లాడుతున్న ప్రజలు
నాయుడుపేట బజారువీధిలో చీకట్లో ట్రాఫిక్ తిప్పలు
తిరుపతి (నగరం), న్యూస్టుడే: ఎండలు అధికంగా కాసినా.. గాలులు బలంగా వీచినా.. పల్లెల్లో అంధకారం అలుముకుంటోంది. అప్రకటిత విద్యుత్తు కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదారు రోజులుగా అక్కడక్కడ పడుతున్న వర్షాలకు వాతావరణం చల్లబడింది. విద్యుత్తు వినియోగం కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎండ నుంచి కొంత ఉపశమనం లభించడం, విద్యుత్తు వినియోగం తక్కువగా ఉండటంతో కోతలు ఉండవని ప్రజలు భావించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి పలు మండలాల్లో విడతల వారీగా విద్యుత్తు కోతలు విధించారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళలో దాదాపు రెండు గంటలు, పట్టణ ప్రాంతాల్లో ఏదో ఒక సమయంలో గంటకు పైగా, తిరుపతి నగరంలో పలు ప్రాంతాల్లో దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు సరఫరా నిలిపివేశారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం అధికారికంగా కోతలు లేకపోయినా అనధికారికంగా అమలు చేస్తున్నారు.
* తిరుచానూరులో నాలుగు రోజుల నుంచి రోజూ పలు దఫాలుగా విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. తిరుపతి గ్రామీణ మండలం పాడిపేట, గంగనగుంట గ్రామాల్లో విద్యుత్తు సరఫరా గంటల తరబడి రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గాలి, వర్షాల కారణంగా విద్యుత్తు తీగల మరమ్మతుల కోసమే సరఫరా నిలిపి వేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. వర్షాలు లేని సమయంలోనూ సరఫరా నిలిపివేయడం గమనార్హం.
తిరుపతి డివిజన్ పరిధిలో...
తిరుపతి గ్రామీణ డివిజన్ పరిధిలోని 187 ఫీడర్లలో 119 వ్యవసాయ ఫీడర్లు ఉన్నాయి. రోజూ డివిజన్ పరిధిలో 3.5 మిలియన్ యూనిట్లు వినియోగం ఉండగా.. ప్రస్తుతం అది 4.2 మిలియన్ యూనిట్లకు చేరింది. ఒక్కసారిగా వినియోగం పెరగడంతో ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయి. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల పరిధిలో విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారు.
నగరంలోనూ.. తిరుపతి నగరం ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో విద్యుత్తుకు అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం నగరంలో ఏదో ఒక ప్రాంతంలో దాదాపు గంటకు పైగా సరఫరా నిలిపివేస్తున్నారు. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు అనధికార కోతలు అమలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
నాయుడుపేట పట్టణం, న్యూస్టుడే: నాయుడుపేట పట్టణంలో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి కరెంటు లేకపోవడంతో ప్రజలు చీకట్లో కాలం గడిపారు. రోజులో ఏదొఒక సమయంలో అనధికారిక కోతలతో తిప్పలు పడుతున్నారు. సబ్స్టేషన్లో మరమ్మతులతో తరచూ తలెత్తడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. పట్టణంలో కరెంటు లేకపోవడంతో ఉక్కపోత, దోమల మోతతో ప్రజలు నిద్రలేని రాత్రిళ్లు గడుపుతున్నారు.
తూర్పున చిమ్మచీకట్లు
గూడూరు గ్రామీణం, న్యూస్టుడే: గూడూరు నియోజకవర్గంలో గాలి వీస్తే కరెంట్ కోత తప్పడం లేదు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోయారు. అనూహ్యంగా వాతావరణంలో మార్పుతో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల ప్రభావానికి ఒక్కసారిగా కరెంట్ పోయింది. గూడూరు పట్టణ, గ్రామీణ, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకు సరఫరా నిలిపివేసి సాయంత్రం ఆరు గంటలకు పునరుద్ధరించారు. గంట తరువాత పలుచోట్ల విద్యుత్తు మళ్లీ నిలిచిపోయింది. కొన్ని పల్లెల్లో కోత ఏర్పడంతో ప్రజలు చిమ్మచీకట్లో కాలం గడిపారు. ఈదురు గాలుల ప్రభావంతో తీర ప్రాంతం చిల్లకూరు మండలంలోని సుమారు 30 పంచాయతీల్లో రాత్రి 8 గంటలకు విద్యుత్తు సరఫరా నిలిచింది. వాకాడు మండలంలోని 19 పంచాయతీల్లో సుమారు ఆరు గంటల పాటు విద్యుత్తు లేదు. దీంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లక్షితపై దాడిచేసి చంపిన చిరుత గుర్తింపు
[ 19-03-2024]
అలిపిరి కాలినడక మార్గంలో లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు. -
ప్రేమ పేరుతో వంచన.. తాళి తెంచి నడిరోడ్డుపై వదిలి
[ 19-03-2024]
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా...కాదంటే చంపేస్తా... ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు, యువతిని బెదిరించి, వేధించి పెళ్లి చేసుకున్నాడు. -
బటన్ నొక్కినా..నగదు పడలేదేమన్నా!
[ 19-03-2024]
ఇచ్చిన మాట నెరవేరుస్తూ.. ఇంతకాలం మన ప్రభుత్వం అందించిన తోడ్పాటు అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందంటూ సీఎం జగన్ వేసిన నాలుగో విడత చేయూత లబ్ధి అక్కచెల్లెమ్మలకు అందలేదు. -
అనుమతులు లేకున్నా..అడ్డుకోకూడదంతే!
[ 19-03-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలనూ వైకాపా ప్రభుత్వం లెక్క చేయడంలేదు. -
కోడ్ ఉంది.. గుట్టుగా కానిచ్చేయ్..!
[ 19-03-2024]
పుత్తూరు పట్టణంలోని రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, కుంటలు, కాలువలు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలాలు కరవయ్యాయి. -
సమస్యల నడుమ ‘పది’ పరీక్ష ప్రారంభం
[ 19-03-2024]
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో సమస్యల నడుమ సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. -
నిబంధనలు మరచి.. భక్తి చూపుతూ
[ 19-03-2024]
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా.. అధికార పార్టీ నాయకుల సేవలో అధికారులు తరిస్తున్నారు. రామకుప్పం మండలానికి మురుగేశ్ కుప్పం మండలంలో టీఏగా పనిచేస్తున్నారు. -
‘ఓపెన్’గా మాస్ కాపీయింగ్
[ 19-03-2024]
సార్వత్రిక పాఠశాలలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమాయ్యయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందినప్పటి నుంచి మూకుమ్మడి చూచిరాతలు మొదలయ్యాయి. -
ఏళ్లుగా విస్మరించి.. ఇప్పుడు హడావుడి
[ 19-03-2024]
ఓటర్లను మభ్య పెట్టేందుకు అధికార వైకాపా కుయుక్తులు పన్నుతూనే ఉంది. -
తెదేపాలో చేరినందుకు.. వైకాపా శ్రేణుల దాడి
[ 19-03-2024]
తెదేపాలో చేరికను జీర్ణించుకోలేక.. వైకాపా కార్యకర్తలు దాడి చేసిన ఘటన చిత్తూరులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. -
రోజమ్మా.. శిల్పారామం ఎక్కడమ్మా..?
[ 19-03-2024]
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని అందరూ భావిస్తారు.. అయితే పర్యాటక శాఖ మంత్రి జిల్లాలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు పదెకరాల స్థలం దొరక్కపోవడమంటే విడ్డూరమే! -
‘అభినయ్ అండతోనే కార్పొరేటర్ల బరితెగింపు’
[ 19-03-2024]
నగరపాలిక ఉపమేయర్ భూమన అభినయ్రెడ్డి ప్రోత్సాహంతోనే అధికార వైకాపా కార్పొరేటర్లు బరితెగించి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని 35వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆరోపించారు. -
పరీక్షకు వెళ్లి.. విగతజీవిగా
[ 19-03-2024]
పదో తరగతి పరీక్ష రాసొస్తాని చెప్పి వెళ్లిన కుమారుడు విగతజీవిగా రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఇంటి పట్టా.. ఇక రానట్టే..!
[ 19-03-2024]
ఇళ్ల స్థలాల మంజూరును నిరంతర ప్రక్రియగా చేశాం.. ఎవరికైనా అర్హత ఉండి ఇంటి స్థలం లేకుంటే దరఖాస్తు చేసిన 90 రోజుల్లో పరిశీలించి మీకు స్థలాలు ఇస్తాం.’ -
అదను చూసి.. బరితెగించి..
[ 19-03-2024]
శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్నగర్ అంటే భూవివాదాలకు చిరునామాగా వినుతికెక్కింది. వైకాపా నేతలు, కొందరు పురపాలిక ఉద్యోగులు ఎంతగా సొమ్ము చేసుకున్నారో అందరికీ తెలిసిందే. -
ఎస్వీయూలో అక్రమ నియామకాలు
[ 19-03-2024]
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను అతిక్రమించి ఎసీˆ్వయూలో 12 మందిని ఒప్పంద పద్ధతిలో నాన్టీచింగ్ ఉద్యోగులుగా నియమించినట్లు సమాచారం. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 19-03-2024]
-
నియమావళి.. ఉల్లంఘించి నిద్రలో జోగాలి
[ 19-03-2024]
సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. జిల్లాలోని చాలాచోట్ల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. -
పేరుకే కుళాయిలు.. పనిచేయని కూలర్లు
[ 19-03-2024]
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అనీష్.. దాదాగిరి
[ 19-03-2024]
నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్, ఆయన అనుచరుల దందాపై నగరవాసులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
అబ్బా.. కొనలేమిక..!
[ 19-03-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛార్జీల మోతతో వినియోగదారులకు విద్యుత్తు శాఖ అంటేనే భయపడేలా చేసింది. -
బంగారం, చిల్లర దుకాణాల్లో చోరీ
[ 19-03-2024]
నాయుడుపేట పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోని ఎన్బీఆర్ఎస్ బంగారు ఆభరణాల దుకాణం, మరో చిల్లర దుకాణంలో ఆదివారం రాత్రి దుండగులు చోరీ చేశారు. -
ఉపాధ్యాయుడికి జైలుశిక్ష
[ 19-03-2024]
వరకట్నం వేధింపు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెవిరెడ్డి సుధాకర్రెడ్డికి వెంకటగిరి ఫస్ట్ క్లాస్ న్యాయస్థానంలో న్యాయమూర్తి అనూష జైలుశిక్ష విధించినట్లు సోమవారం న్యాయస్థానం వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే