అంతా మా ఇష్టం..
జిల్లాలో విద్యుత్తు కోతలు అధికమయ్యాయి.. వేళాపాళా లేకుండా ఇష్టానుసారం కోతలు విధిస్తుండడంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు.. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు.
విద్యుత్తు కోతల్లో నూతన పంథా
ఎడాపెడా నిలిపివేత
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
చిమ్మచీకటిలో పుత్తూరు మండలంలోని తడుకు గ్రామం
చిత్తూరు(మిట్టూరు), పుత్తూరు, న్యూస్టుడే: జిల్లాలో విద్యుత్తు కోతలు అధికమయ్యాయి.. వేళాపాళా లేకుండా ఇష్టానుసారం కోతలు విధిస్తుండడంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు.. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు.. తాజాగా రెండ్రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి కొంత ఉపశమనం లభించినా రాత్రివేళ తీవ్ర ఉక్కపోత తప్పడం లేదు.. వరుణుడు కరుణించినా కోతల నుంచి విముక్తి లభించడం లేదు.. ఇష్టానుసారంగా గ్రామీణ, మండల కేంద్రాల్లో ఎక్కువ సమయం, పట్టణ, నగర ప్రాంతాల్లో తక్కువసేపు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు.
గ్రామాల్లో ఇష్టానుసారంగా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా సరఫరా నిలిపేస్తున్నారు. చిత్తూరు గ్రామీణం, గుడిపాల, పాలసముద్రం, పలమనేరు, పూతలపట్టు, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, పెనుమూరు, బైరెడ్డిపల్లె, గంగవరం, రామకుప్పం ప్రాంతాల్లో అప్రకటిత కోతలు అధికమయ్యాయి. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేక.. లోటు సర్దుబాటుకు గ్రామీణ, మండల ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా కోత విధించక తప్పడం లేదు. రాత్రి అనూహ్యంగా డిమాండ్ పెరిగినప్పుడు దాన్ని నియంత్రించలేక అర గంట నుంచి గంట పాటు నిలిపేస్తున్నా. అధికారులను ప్రశ్నిస్తే లోవోల్టేజీ, వర్షం తదితర సాంకేతిక కారణాలు సాకుగా చూపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లోడ్కు అనుగుణంగా అందించాల్సిన ట్రాన్స్ఫార్మర్లు లేక ఉన్నవి దెబ్బతింటున్నాయి. కొన్నిచోట్ల లైన్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఇబ్బడిముబ్బిడి కోతలతో ఉప కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కారణాలు ఏవైనా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఇక పుత్తూరు విద్యుత్తు డివిజన్ పరిధిలోని గ్రామాల్లో రోజులో కనీసం 10సార్లు నిలిపేస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్తు అందిస్తామని చెబుతున్నా ఏడు గంటలు పగలు, మరో 2 గంటలు రాత్రి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ ప్రారంభం కావడంతో రాత్రి మోటార్లు వేసేందుకు పొలాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గాలి, వాన వస్తే రెండు, మూడు గంటలు అంధకారమే. పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో మరమగ్గ కార్మికులు తరచూ కోతలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం కోతలు విధించడం లేదని, గాలి, వానతో స్తంభాలు కూలిపోతే, లైన్లు మరమ్మతుకు గురైతేనే కొద్దిసేపు సరఫరా నిలుస్తోందని డీఈఈ రెడ్డెప్ప తెలిపారు.
ఎక్కువసార్లు కోతకు శ్రీకారం
ఉమ్మడి జిల్లా తిరుపతి సర్కిల్ పరిధిలో 16 లక్షల విద్యుత్తు సర్వీసులుండగా.. జిల్లా విభజనతో చిత్తూరు జిల్లాలో 9లక్షలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగి వినియోగం పెరిగింది. డిమాండ్కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో కోతలు తప్పడం లేదు. గతంలో నిర్దేశిత సమయంలో 2-3 గంటలు కోతలు విధించడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ దృష్ట్యా అధికారులు తమ పంథా మార్చారు. తక్కువ సమయం(15 నుంచి 20 నిమిషాలు) పాటు ఎక్కువసార్లు కోత విధించే విధానానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. తద్వారా అసలు కోత విధిస్తున్న విషయమే తెలియదు.
రోజుకు 10 నుంచి 15 సార్లు కోతలు
- ప్రభాకర్, రైతు, కన్నికాపురం
చిత్తూరు అర్బన్ డివిజన్ రెడ్డిగుంట ఫీడర్ పరిధిలో రోజుకు కనీసం 10 నుంచి 15సార్లు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. పగటిపూట వ్యవసాయానికి సరఫరా వేళల్లోనూ కోతతో పంటలకు నీరందించ డంలో అవస్థ పడుతున్నాం. ఇక రాత్రివేళ నిర్దేశిత వ్యవధి లేకుండా కోతలు విధిస్తుండటంతో తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నాం.
సాంకేతిక సమస్యలతో..
- హరి, విద్యుత్తు శాఖ, జిల్లా ప్రత్యేక అధికారి
పెనుగాలుల వర్షాలకు ఉపకేంద్రాలు, విద్యుత్తు లైన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. లైన్ల మరమ్మతు, సాంకేతిక సమస్యల పరిష్కారానికి మా్రత్రమే కొద్దిసేపు కోత విధిస్తున్నాం. అంతరాయం లేని సరఫరాకు కృషి చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లక్షితపై దాడిచేసి చంపిన చిరుత గుర్తింపు
[ 19-03-2024]
అలిపిరి కాలినడక మార్గంలో లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు. -
ప్రేమ పేరుతో వంచన.. తాళి తెంచి నడిరోడ్డుపై వదిలి
[ 19-03-2024]
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా...కాదంటే చంపేస్తా... ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు, యువతిని బెదిరించి, వేధించి పెళ్లి చేసుకున్నాడు. -
బటన్ నొక్కినా..నగదు పడలేదేమన్నా!
[ 19-03-2024]
ఇచ్చిన మాట నెరవేరుస్తూ.. ఇంతకాలం మన ప్రభుత్వం అందించిన తోడ్పాటు అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందంటూ సీఎం జగన్ వేసిన నాలుగో విడత చేయూత లబ్ధి అక్కచెల్లెమ్మలకు అందలేదు. -
అనుమతులు లేకున్నా..అడ్డుకోకూడదంతే!
[ 19-03-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలనూ వైకాపా ప్రభుత్వం లెక్క చేయడంలేదు. -
కోడ్ ఉంది.. గుట్టుగా కానిచ్చేయ్..!
[ 19-03-2024]
పుత్తూరు పట్టణంలోని రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, కుంటలు, కాలువలు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలాలు కరవయ్యాయి. -
సమస్యల నడుమ ‘పది’ పరీక్ష ప్రారంభం
[ 19-03-2024]
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో సమస్యల నడుమ సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. -
నిబంధనలు మరచి.. భక్తి చూపుతూ
[ 19-03-2024]
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా.. అధికార పార్టీ నాయకుల సేవలో అధికారులు తరిస్తున్నారు. రామకుప్పం మండలానికి మురుగేశ్ కుప్పం మండలంలో టీఏగా పనిచేస్తున్నారు. -
‘ఓపెన్’గా మాస్ కాపీయింగ్
[ 19-03-2024]
సార్వత్రిక పాఠశాలలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమాయ్యయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందినప్పటి నుంచి మూకుమ్మడి చూచిరాతలు మొదలయ్యాయి. -
ఏళ్లుగా విస్మరించి.. ఇప్పుడు హడావుడి
[ 19-03-2024]
ఓటర్లను మభ్య పెట్టేందుకు అధికార వైకాపా కుయుక్తులు పన్నుతూనే ఉంది. -
తెదేపాలో చేరినందుకు.. వైకాపా శ్రేణుల దాడి
[ 19-03-2024]
తెదేపాలో చేరికను జీర్ణించుకోలేక.. వైకాపా కార్యకర్తలు దాడి చేసిన ఘటన చిత్తూరులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. -
రోజమ్మా.. శిల్పారామం ఎక్కడమ్మా..?
[ 19-03-2024]
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని అందరూ భావిస్తారు.. అయితే పర్యాటక శాఖ మంత్రి జిల్లాలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు పదెకరాల స్థలం దొరక్కపోవడమంటే విడ్డూరమే! -
‘అభినయ్ అండతోనే కార్పొరేటర్ల బరితెగింపు’
[ 19-03-2024]
నగరపాలిక ఉపమేయర్ భూమన అభినయ్రెడ్డి ప్రోత్సాహంతోనే అధికార వైకాపా కార్పొరేటర్లు బరితెగించి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని 35వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆరోపించారు. -
పరీక్షకు వెళ్లి.. విగతజీవిగా
[ 19-03-2024]
పదో తరగతి పరీక్ష రాసొస్తాని చెప్పి వెళ్లిన కుమారుడు విగతజీవిగా రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఇంటి పట్టా.. ఇక రానట్టే..!
[ 19-03-2024]
ఇళ్ల స్థలాల మంజూరును నిరంతర ప్రక్రియగా చేశాం.. ఎవరికైనా అర్హత ఉండి ఇంటి స్థలం లేకుంటే దరఖాస్తు చేసిన 90 రోజుల్లో పరిశీలించి మీకు స్థలాలు ఇస్తాం.’ -
అదను చూసి.. బరితెగించి..
[ 19-03-2024]
శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్నగర్ అంటే భూవివాదాలకు చిరునామాగా వినుతికెక్కింది. వైకాపా నేతలు, కొందరు పురపాలిక ఉద్యోగులు ఎంతగా సొమ్ము చేసుకున్నారో అందరికీ తెలిసిందే. -
ఎస్వీయూలో అక్రమ నియామకాలు
[ 19-03-2024]
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను అతిక్రమించి ఎసీˆ్వయూలో 12 మందిని ఒప్పంద పద్ధతిలో నాన్టీచింగ్ ఉద్యోగులుగా నియమించినట్లు సమాచారం. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 19-03-2024]
-
నియమావళి.. ఉల్లంఘించి నిద్రలో జోగాలి
[ 19-03-2024]
సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. జిల్లాలోని చాలాచోట్ల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. -
పేరుకే కుళాయిలు.. పనిచేయని కూలర్లు
[ 19-03-2024]
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అనీష్.. దాదాగిరి
[ 19-03-2024]
నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్, ఆయన అనుచరుల దందాపై నగరవాసులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
అబ్బా.. కొనలేమిక..!
[ 19-03-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛార్జీల మోతతో వినియోగదారులకు విద్యుత్తు శాఖ అంటేనే భయపడేలా చేసింది. -
బంగారం, చిల్లర దుకాణాల్లో చోరీ
[ 19-03-2024]
నాయుడుపేట పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోని ఎన్బీఆర్ఎస్ బంగారు ఆభరణాల దుకాణం, మరో చిల్లర దుకాణంలో ఆదివారం రాత్రి దుండగులు చోరీ చేశారు. -
ఉపాధ్యాయుడికి జైలుశిక్ష
[ 19-03-2024]
వరకట్నం వేధింపు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెవిరెడ్డి సుధాకర్రెడ్డికి వెంకటగిరి ఫస్ట్ క్లాస్ న్యాయస్థానంలో న్యాయమూర్తి అనూష జైలుశిక్ష విధించినట్లు సోమవారం న్యాయస్థానం వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?