అంతా మా ఇష్టం..
జిల్లాలో విద్యుత్తు కోతలు అధికమయ్యాయి.. వేళాపాళా లేకుండా ఇష్టానుసారం కోతలు విధిస్తుండడంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు.. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు.
విద్యుత్తు కోతల్లో నూతన పంథా
ఎడాపెడా నిలిపివేత
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
చిమ్మచీకటిలో పుత్తూరు మండలంలోని తడుకు గ్రామం
చిత్తూరు(మిట్టూరు), పుత్తూరు, న్యూస్టుడే: జిల్లాలో విద్యుత్తు కోతలు అధికమయ్యాయి.. వేళాపాళా లేకుండా ఇష్టానుసారం కోతలు విధిస్తుండడంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు.. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు.. తాజాగా రెండ్రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి కొంత ఉపశమనం లభించినా రాత్రివేళ తీవ్ర ఉక్కపోత తప్పడం లేదు.. వరుణుడు కరుణించినా కోతల నుంచి విముక్తి లభించడం లేదు.. ఇష్టానుసారంగా గ్రామీణ, మండల కేంద్రాల్లో ఎక్కువ సమయం, పట్టణ, నగర ప్రాంతాల్లో తక్కువసేపు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు.
గ్రామాల్లో ఇష్టానుసారంగా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా సరఫరా నిలిపేస్తున్నారు. చిత్తూరు గ్రామీణం, గుడిపాల, పాలసముద్రం, పలమనేరు, పూతలపట్టు, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, పెనుమూరు, బైరెడ్డిపల్లె, గంగవరం, రామకుప్పం ప్రాంతాల్లో అప్రకటిత కోతలు అధికమయ్యాయి. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేక.. లోటు సర్దుబాటుకు గ్రామీణ, మండల ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా కోత విధించక తప్పడం లేదు. రాత్రి అనూహ్యంగా డిమాండ్ పెరిగినప్పుడు దాన్ని నియంత్రించలేక అర గంట నుంచి గంట పాటు నిలిపేస్తున్నా. అధికారులను ప్రశ్నిస్తే లోవోల్టేజీ, వర్షం తదితర సాంకేతిక కారణాలు సాకుగా చూపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లోడ్కు అనుగుణంగా అందించాల్సిన ట్రాన్స్ఫార్మర్లు లేక ఉన్నవి దెబ్బతింటున్నాయి. కొన్నిచోట్ల లైన్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఇబ్బడిముబ్బిడి కోతలతో ఉప కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కారణాలు ఏవైనా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఇక పుత్తూరు విద్యుత్తు డివిజన్ పరిధిలోని గ్రామాల్లో రోజులో కనీసం 10సార్లు నిలిపేస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్తు అందిస్తామని చెబుతున్నా ఏడు గంటలు పగలు, మరో 2 గంటలు రాత్రి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ ప్రారంభం కావడంతో రాత్రి మోటార్లు వేసేందుకు పొలాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గాలి, వాన వస్తే రెండు, మూడు గంటలు అంధకారమే. పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో మరమగ్గ కార్మికులు తరచూ కోతలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం కోతలు విధించడం లేదని, గాలి, వానతో స్తంభాలు కూలిపోతే, లైన్లు మరమ్మతుకు గురైతేనే కొద్దిసేపు సరఫరా నిలుస్తోందని డీఈఈ రెడ్డెప్ప తెలిపారు.
ఎక్కువసార్లు కోతకు శ్రీకారం
ఉమ్మడి జిల్లా తిరుపతి సర్కిల్ పరిధిలో 16 లక్షల విద్యుత్తు సర్వీసులుండగా.. జిల్లా విభజనతో చిత్తూరు జిల్లాలో 9లక్షలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగి వినియోగం పెరిగింది. డిమాండ్కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో కోతలు తప్పడం లేదు. గతంలో నిర్దేశిత సమయంలో 2-3 గంటలు కోతలు విధించడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ దృష్ట్యా అధికారులు తమ పంథా మార్చారు. తక్కువ సమయం(15 నుంచి 20 నిమిషాలు) పాటు ఎక్కువసార్లు కోత విధించే విధానానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. తద్వారా అసలు కోత విధిస్తున్న విషయమే తెలియదు.
రోజుకు 10 నుంచి 15 సార్లు కోతలు
- ప్రభాకర్, రైతు, కన్నికాపురం
చిత్తూరు అర్బన్ డివిజన్ రెడ్డిగుంట ఫీడర్ పరిధిలో రోజుకు కనీసం 10 నుంచి 15సార్లు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. పగటిపూట వ్యవసాయానికి సరఫరా వేళల్లోనూ కోతతో పంటలకు నీరందించ డంలో అవస్థ పడుతున్నాం. ఇక రాత్రివేళ నిర్దేశిత వ్యవధి లేకుండా కోతలు విధిస్తుండటంతో తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నాం.
సాంకేతిక సమస్యలతో..
- హరి, విద్యుత్తు శాఖ, జిల్లా ప్రత్యేక అధికారి
పెనుగాలుల వర్షాలకు ఉపకేంద్రాలు, విద్యుత్తు లైన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. లైన్ల మరమ్మతు, సాంకేతిక సమస్యల పరిష్కారానికి మా్రత్రమే కొద్దిసేపు కోత విధిస్తున్నాం. అంతరాయం లేని సరఫరాకు కృషి చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం