బకాయిలిస్తేనే మరమ్మతులు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియంత్రికలు మండుతున్నాయి.. ఎండలు తీవ్రమవడం.. విద్యుత్తు వినియోగం పెరగడం.. అధిక లోడు, సాంకేతిక కారణాలతో దగ్ధమవుతున్న వాటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది..
మండుతున్న నియంత్రికలు
అన్నదాతలకు తప్పని తిప్పలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియంత్రికలు మండుతున్నాయి.. ఎండలు తీవ్రమవడం.. విద్యుత్తు వినియోగం పెరగడం.. అధిక లోడు, సాంకేతిక కారణాలతో దగ్ధమవుతున్న వాటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.. ఫలితంగా వీటి మరమ్మతుల్లో జాప్యం చోటుచేసుకుని అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు.. దెబ్బతిన్న వాటిని బాగుచేయడంలో జరుగుతున్న తాత్సారం వారి పాలిట శాపంగా పరిణమిస్తోంది.. బకాయిలు చెల్లించకపోవడంతో మరమ్మతులు చేయలేమంటూ గుత్తేదారులు చేతులెత్తేస్తున్నారు.
న్యూస్టుడే, చిత్తూరు (మిట్టూరు): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని రకాల విద్యుత్తు సర్వీసులు సుమారు 19 లక్షలు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ కనెక్షన్లు 3.1 లక్షలు ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఫీడర్లు అందుబాటులో ఉన్నాయి. సాగునీరు అందుబాటులో ఉండటం, ఎండలు తీవ్రతరం కావడంతో విద్యుత్తు వినియోగం మరింత పెరిగింది. సాంకేతిక సమస్యలతో కాలిపోయిన వాటికి ప్రత్యామ్నాయంగా మరోదాన్ని ఏర్పాటు చేయడంలో సిబ్బంది తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
గుత్తేదారులు చేతులెత్తేస్తే కష్టమే..
వీటిని మరమ్మతు చేసే గుత్తేదారులకు రూ.3 కోట్ల మేర బకాయిలు చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరులో మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. గుత్తేదారులకు కొద్ది నెలలుగా చెల్లింపులు జరగలేదు. ఇవి రూ.3-3.5 కోట్లు ఉన్నట్లు సమాచారం. రానున్న రెండు నెలలు మరమ్మతు కేంద్రాలు, గుత్తేదారుల పనితీరు ఎంతో కీలకం. ఈ సమయంలో గుత్తేదారులు చేతులెత్తేస్తే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే.
మాటల్లోనే మార్పు..
ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి ఒకటి నుంచి ఇప్పటివరకు 1500లకుపైగా నియంత్రికలు దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో అత్యధికం వ్యవసాయ సర్వీసులవే. గ్రామీణ ప్రాంతాల్లో కాలిపోయిన 48 గంటల్లోగా మార్చాలి. పలు మండలాల్లో రోజులు గడుస్తున్నా కనీసం వాటివైపు చూసేవారు కరవయ్యారు. పంటలను కాపాడుకోవాలనే తాపత్రయంతో రైతులు పక్కన ఉన్న వాటి నుంచి విద్యుత్తు సరఫరా తీసుకుని పంటలకు నీటి తడులు ఇస్తున్నారు.
త్వరలో బిల్లుల చెల్లింపు
గుత్తేదారుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం. ఇప్పటికే ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులకు బిల్లులు సమర్పించాం. జాప్యం లేకుండా మరమ్మతు చేసి నియంత్రికలు అందజేస్తున్నాం.
- మహేశ్వరరెడ్డి, ఈఈ, నియంత్రికల మరమ్మతు కేంద్రాలు, తిరుపతి సర్కిల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే