logo

కుప్పంలో వైకాపా నాయకులకు షోకాజ్‌ నోటీసులు

కుప్పంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వైకాపా నాయకులకు.. ఆ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

Published : 16 Apr 2024 01:30 IST

చిత్తూరు కలెక్టరేట్‌: కుప్పంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వైకాపా నాయకులకు.. ఆ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. సీఎం జగన్‌పై విజయవాడలో రాయితో దాడి చేశారని పేర్కొంటూ ఆదివారం కుప్పం పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట చేపట్టిన నిరసనలో.. డౌన్‌డౌన్‌ చంద్రబాబు అంటూ వైకాపా నాయకులు నినాదాలు చేసి ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేపట్టాలంటే ముందుగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనల్ని వైకాపా నాయకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటనపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించి వైకాపా నాయకులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని