logo

రూ.3.30 లక్షల సొత్తు చోరీ

పట్టణంలోని సత్యనారాయణపురంలో ఓ ఇంటిలో దొంగలు చొరబడి నగదు, బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్యనారాయణపురానికి చెందిన ఎంఎస్‌బీ భాస్క

Published : 20 May 2022 05:45 IST

ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీం

సామర్లకోట: పట్టణంలోని సత్యనారాయణపురంలో ఓ ఇంటిలో దొంగలు చొరబడి నగదు, బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్యనారాయణపురానికి చెందిన ఎంఎస్‌బీ భాస్కర్‌కుమార్‌ తన నివాసంలో అంతా కలిసి నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉంచిన రూ.1.30 లక్షలు, రూ.2 లక్షల విలువైన ఆభరణాలు అపహరించుకుపోయారు. అర్ధరాత్రి 12 గంటల వరకు మెలకువగా ఉన్నామని.. ఆ తరువాత అంతా ఒకే గదిలో నిద్రించామని, ఉదయం లేచి చూసే సరికి బీరువాలోని సొత్తు చోరీకి గురైనట్లు గుర్తించామని ఫిర్యాదులో పేర్కొనట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పెద్దాపురం సీసీఎస్‌ సీఐ బాలాశౌరి, సిబ్బంది గంగిరెడ్డి బలరాం, బుద్ధరాజు, క్లూస్‌ టీం బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాస్తు చేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని