ఓపీకే పరీక్ష..!
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరతతో రోగులు నరకయాతన పడుతున్నారు.
కాలికి శస్త్రచికిత్స చేసుకున్నఉప్పాడకు చెందిన సత్యనారాయణను ఎత్తుకుని రక్త పరీక్షలకు తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరతతో రోగులు నరకయాతన పడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి వివిధ పరీక్షలు చేసేందుకు క్యాజువాలిటీ, వార్డుల నుంచి తీసుకువెళ్లడానికి స్ట్రెచ్చర్లు, వీల్ ఛైర్లు కనీస స్థాయిలో అందుబాటులోలేక అల్లాడుతున్నారు. రోగిని కుటుంబ సభ్యులు, బంధువులు చేతులపై ఎత్తుకుని సీటీస్కాన్, ఎక్స్రే, తదితర పరీక్షలకు తీసుకువెళ్లే దయనీయ పరిస్థితి జీజీహెచ్లో నెలకొంది. జీజీహెచ్ సందర్శనకు ఒకటి, రెండు రోజుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం వచ్చి అన్ని విభాగాలనూ పరిశీలించనుంది. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, పడకలు, ఇతర వైద్య సదుపాయాలకు సంబంధించిన వనరులను తనిఖీ చేయనుంది. వీరి రాకతోనైనా రోగుల ఇబ్బందులు తొలగుతాయా.. అవసరమైన వైద్య మౌలిక వనరులు సమకూరుతాయా.. అనేది వేచి చూడాలి.
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్, మసీదు సెంటర్
జీజీహెచ్ను సందర్శించనున్న ఎంసీఐ బృందం
జీజీహెచ్కు వైద్య చికిత్సల నిమిత్తం రోజూ సుమారు 3,000 మంది రోగులు వస్తున్నారు. వీరిలో సుమారు 1,500 మంది ఇన్ పేషెంట్లు ఉంటున్నారు. 24 విభాగాల పరిధిలో 1,165 పడకలు ఉండగా, కొవిడ్ నేపథ్యంలో మరో 700 పడకలు అందుబాటులోకి తెచ్చినా పడకల కొరత తీవ్రంగా వేధిస్తోంది. క్యాజువాలిటీ వార్డులోనే మంచానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉంటున్నారు. దీంతో రోగులతోపాటు, చికిత్స చేసే వైద్యులూ ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర, ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి చికిత్స అందించి వార్డులకు తరలించే ఇక్కడ పరిస్థితి దయనీయంగా ఉంది. శస్త్రచికిత్సలు చేసే థియేటర్లలో వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉంది. ఎనస్తీషియాకు సంబంధించిన పరికరాలు చాలా వరకు పాడైపోవడంతో ఉన్నవాటితోనే శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.
ఎంఆర్ఐ పనిచేయకపోయినా హడావుడి..
జీజీహెచ్లోని ఎంఆర్ఐ యంత్రం 2021, డిసెంబరు నుంచి పనిచేయకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో స్కానింగ్లు చేయిస్తున్నారు. దీని నిర్వహణను ఓ ప్రయివేటు సంస్థకు అప్పగించగా.. ఒప్పంద గడువు 2021 డిసెంబరుతో ముగిసింది. దీంతో స్కానింగ్ యంత్రాన్ని జీజీహెచ్కు అప్పగించాల్సి ఉంది. ఈ సంస్థ ఒప్పంద కాలంలోనే ఎంఆర్ఐ యంత్రం మరమ్మతులకు గురవడంతో ఈ సేవలు నిలిచిపోయాయి. కొత్త యంత్రం కొనుగోలు రూ.10కోట్లు కేటాయించినా ఇప్పటికీ సాకారం కాలేదు. దీనికి రూ.65 లక్షలతో మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంసీఐ బృందం వస్తున్న నేపథ్యంలో రెండ్రోజులుగా ఎంఆర్ఐ విభాగాన్ని శుభ్రం చేస్తున్నారు. మూసివేసిన దీన్ని పనిచేస్తున్నట్లు చెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
*జీజీహెచ్ ఓపీని ఆన్లైన్ చేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. టికెట్ తీసుకునేందుకు ఒకే కౌంటర్ ఉంది. వీటిని పెంచాల్సిన అవసరం ఉంది.
*రోగిని క్యాజువాలిటీ నుంచి వార్డులో అడ్మిషన్కు ప్రత్యేక కౌంటరు వద్ద నమోదు చేసుకోవాలి. దీనికీ ఒకే కౌంటరు ఉంది. దీంతో రోగులు, గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి వరుసలో నిలబడాల్సి వస్తోంది.
* వైద్యులు రాసిచ్చిన మందులు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్లు తక్కువగా ఉన్నాయి. వైద్యం పొందే సమయం కన్నా, మందులు తీసుకోడానికే ఎక్కవసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
* ప్రధానంగా గైనిక్ విభాగంలో పడకల కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమిస్తారని, తప్పని పరిస్థితుల్లోనే శస్త్రచికిత్సలు చేస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది. ఇక్కడ పడకల కొరత తీవ్రంగా ఉంది. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు గర్భిణులు, బాలితలు ఉండాల్సిన పరిస్థితి ఉంది.
సదుపాయాలపై ఆరా
జీజీహెచ్ బోధనాసుపత్రికి రంగరాయ వైద్య కళాశాల అనుబంధంగా ఉంది. ఈ కళాశాలలకు కేటాయించే ఎంబీబీఎస్, పీజీ సీట్లు, దీనికి తగ్గట్టుగా జీజీహెచ్లో వైద్య పరికరాలు ఉన్నాయా.. లేదా.. ఈసీజీ, ఎక్స్రే యూనిట్లు, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రాలు, ఇతర వైద్య పరికరాలు, పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై ఈ బృందం ఆరా తీయనుంది. రోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్సల తీరును పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ కోర్సులకు తగ్గట్టుగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారా అనే కోణంలోనూ ఆరా తీయనున్నారు. దీని ఆధారంగా అదనపు సీట్లు సమకూరే అవకాశం ఉంటుంది.
అన్ని విభాగాలనూ పరిశీలిస్తారు..
ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో ఫ్యాకల్టీ, వైద్య మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు ఎంసీఐ బృందం రానుంది. ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులను బృందానికి తెలియజేస్తాం. పనిచేయని యంత్రాల పరిస్థితిని వివరిస్తాం. ఎంఆర్ఐ స్కానింగ్కు బయటకు పంపించే అంశాన్ని బృందానికి చెబుతాం. జీజీహెచ్లో అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సీట్లు పెంచే అవకాశం ఉంది.
డాక్టర్ హేమలతాదేవి, పర్యవేక్షకుల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం